News May 23, 2024
శ్రీకాకుళం: ఐటీఐలో 550 ఉద్యోగాలతో జాబ్ మేళా

ఎచ్చెర్ల ప్రభుత్వ ఐటీఐలో నేడు జాబ్ మేళా నిర్వహించనున్నారు. 18-35 వయసు గల అభ్యర్థులు జాబ్ మేళాలో పాల్గొనవచ్చు. ఈ మేళాలో 550 ఉద్యోగాలు భర్తీ చేయనున్నారు. టెన్త్, ఐటీఐ ఒరిజినల్ పత్రాలు, ఆధార్ కార్డుతో పాటు బయోడేటా జిరాక్స్ కాపీలు 2 సెట్లు, పాస్పోర్టు సైజు ఫోటోలతో ఉ. 9 గంటలకు హాజరు కావాలాని సంబంధిత అధికారులు తెలిపారు. ఈ అవకాశాన్ని సద్వినియోగ పరుచుకోవాలని సూచించారు.
Similar News
News November 16, 2025
కన్నా లేవారా.. కన్నీటి రోదన మిగిల్చిన నీటి కుంట

కళ్లెదుట ఉన్న పిల్లలు నీటి కుంటలో పడి కానారాని లోకాలకెళ్లారని కన్నవారు జీర్ణించుకోలేకపోయారు. కన్నా..లేవరా అంటూ..చిన్నారుల మృతదేహాలపై పడి కన్నవారి కన్నీటి రోదనకు..ఊరంతా వేదనలో పడింది. వివరాల్లోకి వెళ్తే.. సంతబొమ్మాళి(M) పంటిగుంటకు చెందిన అవినాష్(9), సుధీర్(8)లు ఆదివారం సాయంత్రం నీటి కుంటలో స్నానానికి దిగి ..ప్రమాదవశాత్తూ మునిగి చనిపోయారు. దీనిపై SI సింహాచలం కేసు నమోదు చేశారు.
News November 16, 2025
మరోసారి ఐపీఎల్కు సిక్కోలు యువకుడు

ఐపీఎల్-2026లో సిక్కోలు యువ క్రికెటర్ త్రిపురాన విజయ్ మరోసారి మెరువనున్నాడు. టెక్కలికి చెందిన విజయ్ను రూ.30లక్షలకు రిటైన్ చేసుకున్నట్లు తాజాగా ఢిల్లీ క్యాపిటల్స్ యాజమాన్యం ప్రకటించింది. దీంతో రానున్న ఐపీఎల్ సీజన్లో విజయ్ ఆడనున్నాడు. గత కొన్నేళ్లుగా ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో విజయ్ శిక్షణ పొందుతూ పలు కీలక క్రికెట్ టోర్నీల్లో ప్రతిభ కనబరుస్తున్నారు.
News November 16, 2025
SKLM: బంగారమంటూ పిలిచి.. బురిడీ కొట్టించాడు

ప్రేమిస్తున్నాని..పెళ్లి చేసుకుందామని ఆ యువతిని కుర్రాడు నమ్మించాడు. బంగారమంటూ పిలిస్తే..మురిసిపోయిందేమో యువకుడితో పెళ్లికి సిద్ధమైంది. శ్రీకాకుళానికి చెందిన వీరిద్దరూ HYDకు ఈనెల14న బయలుదేరారు. VJAలో బస్సు మారే క్రమంలో నగల బ్యాగ్, ఫోన్తో పారిపోయాడు. చావే దిక్కని ఏడుస్తున్న ఆమెను కృష్ణలంక పోలీసులు ప్రశ్నిస్తే విషయం తెలిసింది. దర్యాప్తు చేసి నగలతోపాటు యువతిని పేరెంట్స్కు నిన్న అప్పగించారు.


