News May 23, 2024
శ్రీకాకుళం: ఐటీఐలో 550 ఉద్యోగాలతో జాబ్ మేళా
ఎచ్చెర్ల ప్రభుత్వ ఐటీఐలో నేడు జాబ్ మేళా నిర్వహించనున్నారు. 18-35 వయసు గల అభ్యర్థులు జాబ్ మేళాలో పాల్గొనవచ్చు. ఈ మేళాలో 550 ఉద్యోగాలు భర్తీ చేయనున్నారు. టెన్త్, ఐటీఐ ఒరిజినల్ పత్రాలు, ఆధార్ కార్డుతో పాటు బయోడేటా జిరాక్స్ కాపీలు 2 సెట్లు, పాస్పోర్టు సైజు ఫోటోలతో ఉ. 9 గంటలకు హాజరు కావాలాని సంబంధిత అధికారులు తెలిపారు. ఈ అవకాశాన్ని సద్వినియోగ పరుచుకోవాలని సూచించారు.
Similar News
News October 2, 2024
స్వర్ణాంధ్ర విజన్లో భాగస్వామ్యం కావాలి: కలెక్టర్
స్వర్ణాంధ్ర విజన్ రూపకల్పనలో ప్రజలందరూ భాగస్వాములై తమ అభిప్రాయాలను తెలపాలని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ కోరారు. స్వర్ణాంధ్ర-2047 విజన్ ప్రణాళికను రూపొందించడంలో రాష్ట్రంలోనే శ్రీకాకుళం జిల్లా తొలిస్థానంలో నిలిచిందన్నారు. ఇంకా సమయం ఉన్నందున స్వర్ణాంధ్రప్రదేశ్ సాధనకు అవసరమైన సలహాలు సూచనలు అందించాలని అన్ని వర్గాలను కోరుతున్నట్లు చెప్పారు. మంగళవారం సాయంత్రం కలెక్టరేట్ సమావేశమందిరంలో మాట్లాడారు.
News October 1, 2024
శ్రీకాకుళం: మొదలైన మద్యం అమ్మకాలు
రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ వైన్ షాప్లో పనిచేస్తున్న సూపర్వైజర్లు, సేల్స్ మేన్లకు ఉద్యోగ భద్రత కల్పించాలనే డిమాండ్తో ఉదయం నుంచి సేల్స్ మాన్లు, సూపర్వైజర్లు మద్యం అమ్మకాలు చేపట్టకుండా సమ్మె చేశారు. జిల్లాలో 193 ప్రభుత్వ వైన్ షాపుల్లో పనిచేసిన సేల్స్ మెన్లు, సూపర్వైజర్ల కాంట్రాక్ట్ నిన్నటితో ముగిసింది. వీరితో చర్చించి 5వ తేదీ వరకు మద్యం అమ్మకాలు చేపట్టాలని సూచించడంతో 5గంటలనుంచి ప్రారంభించారు.
News October 1, 2024
కలెక్టర్ని కలిసిన ఇచ్ఛాపురం ఎమ్మెల్యే
ఇచ్ఛాపురం నియోజవర్గ ఎమ్మెల్యే డాక్టర్ బెందాళం అశోక్ బాబు మంగళవారం కలెక్టరేట్లో కలెక్టర్ స్వప్నిల్ దినకర్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా నియోజకవర్గంలో కవిటి, సోంపేట, ఇచ్చాపురం, కంచిలి మండలంలో ప్రధాన సమస్యలపై కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. కలెక్టర్ సానుకూలంగా స్పందించి సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తామని హామీ ఇచ్చారు.