News December 27, 2024
శ్రీకాకుళం: ‘మన్మోహన్ సింగ్తో అనుబంధం మరువలేనిది’

మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మరణం బాధాకరమని రాష్ట్ర మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు. గరువారం రాత్రి మన్మోహన్ సింగ్ మరణించడంతో ఆయనతో కలిసి ఉన్న ఫోటోలను అచ్చెన్న సోషల్ మీడియాలో పంచుకున్నారు. దేశంలో నూతన ఆర్థిక సంస్కరణలు చేపట్టిన వ్యక్తిగా మన్మోహన్ సింగ్ చరిత్రలో నిలిచిపోతారన్నారు. ఆయనతో అనుబంధం మరువలేనిదని పేర్కొన్నారు. ఆయన కుటుంబానికి అచ్చెన్న ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.
Similar News
News October 19, 2025
శ్రీకాకుళం: ఇంటికొస్తూ యువకుడి మృతి

దీపావళి కోసం ఇంటికొస్తూ ఓ వ్యక్తి చనిపోయిన విషాద ఘటన ఇది. ఇచ్ఛాపురం(M) లొద్దపుట్టికి చెందిన వసంత్ కుమార్(32), బెల్లుపడ అచ్చమ్మపేటకు చెందిన సంధ్యకు మార్చిలో పెళ్లి జరిగింది. వసంత్ కుమార్ విజయవాడలో పనిచేస్తూ అక్కడే కాపురం పెట్టాడు. దీపావళి కోసం బైకుపై ఇద్దరూ స్వగ్రామానికి శనివారం బయల్దేరారు. ప్రత్తిపాడు మండలం ధర్మవరం వద్ద హైవేపై ఆగిఉన్న లారీని ఢీకొట్టారు. భర్త చనిపోగా భార్య తీవ్రంగా గాయపడింది.
News October 19, 2025
జీఎస్టీ 2.0తో మంచి సంస్కరణలు: కేంద్రమంత్రి

జీఎస్టీ 2.0 తో మంచి సంస్కరణలు అమలు అయ్యాయని కేంద్ర పౌరవిమానయన శాఖామంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు అన్నారు. శ్రీకాకుళం NTR మున్సిపల్ గ్రౌండ్స్లో సిక్కోలు ఉత్సవ్ పేరుతో జరుగుతున్న సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ ముగింపు కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఆయన శనివారం హాజరయ్యారు. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థలో విప్లవాత్మకమైన మార్పులు తీసుకురావాలనే ఆలోచనతో GST2.0ను పీఎం మోదీ అమలు చేశారన్నారు.
News October 19, 2025
శ్రీకాకుళం: తహశీల్దార్ను తొలగించాలని ఆందోళన

ఓ బీసీ మహిళను కొత్తూరు తహశీల్దార్ కె.బాలకృష్ణ మానసికంగా వేధిస్తున్నారని.. ఆయనను వెంటనే విధుల నుంచి తొలగించాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘ జిల్లా అధ్యక్షుడు కూటికుప్పల నరేశ్ కుమార్ డిమాండ్ చేశారు. శ్రీకాకుళం కలెక్టర్ కార్యాలయం వద్ద బీసీ సంఘాల నాయకులు శనివారం ఆందోళన చేశారు. ఇంటి స్థలం పొజిషన్ సర్టిఫికెట్ కోసం రూ.30వేలు లంచం ఇవ్వాలని, లేకపోతే తనతో ఒక రోజు గడపాలని తహశీల్దార్ కోరడం దురదృష్టకరమన్నారు.