News July 27, 2024

శ్రీకాకుళం: IIIT ప్రవేశాలకు తొలి రోజు 461 మంది హాజరు

image

శ్రీకాకుళం రాజీవ్ గాంధీ వైజ్ఞానిక సాంకేతిక విశ్వవిద్యాలయం(ఆర్జీయూకేటీ) ప్రవేశాలకు సంబంధించి కౌన్సెలింగ్ శుక్రవారం ప్రారంభమైంది. తొలి రోజు సర్టిఫికెట్ల పరిశీలనకు 515 మంది విద్యార్థులు హాజరు కావాల్సి ఉండగా 461 మంది హాజరయ్యారు. 54 మంది గైర్హాజరయ్యారు. హాజరైన వారిలో 296 బీసీ, 56 ఎస్సీ, 78 ఈడబ్ల్యూఎస్, 22 ఎస్టీ, 9 మంది ఓసీ విద్యార్థులు ఉన్నట్లు డైరెక్టర్ ప్రొఫెసర్ బాలాజీ తెలిపారు.

Similar News

News November 23, 2025

ఈ అంబులెన్స్ ప్రజా సేవకు అంకితం: కలెక్టర్

image

కొత్తగా కొనుగోలు చేసిన ఆంబులెన్స్‌ను ప్రజాసేవకు అంకితం చేస్తున్నట్లు కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ తెలిపారు. రెడ్ క్రాస్ సొసైటీ కార్యాలయంలో కొత్త ఆంబులెన్స్‌ను శనివారం ఆయన ప్రారంభించారు. ప్రస్తుతం ఉన్న ఆంబులెన్స్ పాడైపోవడంతో ఆ సంస్థ ఛైర్మన్ జగన్మోహన్రావు కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. కొత్త వాహనానికి రూ. 19.54 లక్షలు విడుదల చేసినట్లు కలెక్టర్ చెప్పారు.

News November 23, 2025

ఈ అంబులెన్స్ ప్రజా సేవకు అంకితం: కలెక్టర్

image

కొత్తగా కొనుగోలు చేసిన ఆంబులెన్స్‌ను ప్రజాసేవకు అంకితం చేస్తున్నట్లు కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ తెలిపారు. రెడ్ క్రాస్ సొసైటీ కార్యాలయంలో కొత్త ఆంబులెన్స్‌ను శనివారం ఆయన ప్రారంభించారు. ప్రస్తుతం ఉన్న ఆంబులెన్స్ పాడైపోవడంతో ఆ సంస్థ ఛైర్మన్ జగన్మోహన్రావు కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. కొత్త వాహనానికి రూ. 19.54 లక్షలు విడుదల చేసినట్లు కలెక్టర్ చెప్పారు.

News November 22, 2025

మందస: లారీ ఢీకొని ఒకరు మృతి

image

లారీ ఢీకొని ఓ వ్యక్తి మృతి చెందాడు. ఈ ఘటన మందస మండలం బాలిగాం బ్రిడ్జి సమీపాన శనివారం సాయంత్రం చోటుచేసుకుంది. పలాస నుంచి ఇచ్ఛాపురం జాతీయ రహదారిపై గుడ్లు లోడుతో వెళ్తున్న లారీ బాలిగాం బ్రిడ్జ్ సమీపాన బైక్‌ను ఢీకొంది. క్షతగాత్రుడికి తీవ్ర గాయలవ్వగా హరిపురం సీహెచ్‌సీకి తరలిస్తుండగా మరణించాడు. మృతుడు శాసనం గ్రామానికి చెందిన ధర్మారావు(45)గా సమాచారం. పోలీసు కేసు నమోదైంది.