News January 21, 2026
‘ఆత్మ’తో రైతులకు సాంకేతికత చేరువయ్యేనా..!

అగ్రికల్చరల్ టెక్నాలజీ మేనేజ్మెంట్ ఏజెన్సీ(ATMA)పై విమర్శలొస్తున్నాయి. సాగులో వచ్చే సాంకేతిక పద్ధతులపై రైతులకు అవగాహన కల్పించడం, శిక్షణ తరగతులు, ప్రదర్శనలు, కిసాన్ మేలా చేపట్టాల్సి ఉన్నా ఆ దిశగా అడుగులు పడటం లేదు. ఏడాదికి 715 కార్యక్రమాలు జరగాల్సి ఉండగా 131 మాత్రమే చేపట్టారు. GOVT ₹59.52 లక్షలు మంజురు చేయగా ₹9.34 లక్షలు మాత్రమే రైతుల శిక్షణలకు కేటాయించారు. ఈ నిర్లక్ష్యంపై పలువురు మండిపడుతున్నారు.
Similar News
News April 20, 2026
బసవేశ్వరుడికి నెల్లూరు కలెక్టర్ నివాళులు

నెల్లూరు కలెక్టరేట్లో మహాత్మా బసవేశ్వర జయంతి సోమవారం జరిగింది. కలెక్టర్ హిమాన్షు శుక్లా, జాయింట్ కలెక్టర్ మొగిలి వెంకటేశ్వర్లు, జిల్లా రెవెన్యూ అధికారి విజయకుమార్ తదితరులు బసవేశ్వర చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. బసవేశ్వర గొప్ప సామాజిక సంస్కర్త, తత్వవేత్త, కవి అన్నారు. కుల, లింగ వివక్షతను వ్యతిరేకిస్తూ సమసమాజ నిర్మాణం కోసం కృషి చేశారని కొనియాడారు.
News April 20, 2026
ఫలించిన నెల్లూరు కలెక్టర్ ప్రయత్నం

నెల్లూరు ఇన్ఛార్జ్ DPO వసుమతికి ఇటీవలే సీఈవోగా ప్రమోషన్ లభించింది. ఆ తర్వాత ఆమెను తిరుపతి జిల్లాకు బదిలీ చేశారు. నెల్లూరు జిల్లాలోనే ఆమెకు బాధ్యతలు ఇవ్వాలని కలెక్టర్ హిమాన్షు శుక్లా ఆ శాఖ రాష్ట్ర కమిషనర్కు లేఖ రాశారు. దీనికి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇందులో భాగంగా ఆమెను నెల్లూరు జిల్లా స్వర్ణ గ్రామ/వార్డు అధికారిణిగా నియమించారు.
News April 20, 2026
BREAKING: నెల్లూరులో ఘోర ప్రమాదం

నెల్లూరు సిటీలో సోమవారం ఉదయం ఘోర ప్రమాదం జరిగింది. ముత్తుకూరు రోడ్డు వడ్డిపాలెం సమీపంలో స్కూటీని ట్రాక్టర్ ఢీకొట్టింది. ఈ ఘటనలో ఇద్దరు యువకులు చక్రాల కింద పడటంతో స్పాట్లోనే చనిపోయారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. స్కూటీ నంబర్ AP40KK6649 ఆధారంగా మృతుల వివరాలు సేకరిస్తున్నారు.


