News February 7, 2026
ఎన్నికల్లో పీవో, ఏపీవోల పాత్ర కీలకం: కలెక్టర్ విజయేంద్ర

ఈనెల 11న జరిగే మున్సిపల్ ఎన్నికలను పటిష్టంగా నిర్వహించాలని అధికారులను కలెక్టర్ విజయేంద్ర బోయి ఆదేశించారు. ఎన్నికల్లో పీవో, ఏపీవోల పాత్ర కీలకమని అన్నారు. పాలమూరు కార్పొరేషన్, దేవరకద్ర, భూత్పూర్ ఎన్నికల సిబ్బంది అప్రమత్తంగా ఉండాలన్నారు. సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలకు 36 మంది మైక్రో అబ్జర్వర్లను నియమించినట్లు తెలిపారు. విధి నిర్వహణలో ఎలాంటి పొరపాట్లు జరగకుండా పారదర్శకత పాటించాలని స్పష్టం చేశారు.
Similar News
News April 20, 2026
MBNR: మహిళా డిగ్రీ కళాశాలలో ప్రవేశాలకు దరఖాస్తులు

మహబూబ్నగర్ పిల్లలమర్రి సమీపంలోని తెలంగాణ సాంఘిక సంక్షేమ మహిళా డిగ్రీ కళాశాలలో 2026-27 విద్యాసంవత్సరానికి ప్రవేశాలు ప్రారంభమయ్యాయని ప్రిన్సిపల్ డాక్టర్ జయప్రద తెలిపారు. బీఎస్సీ, బీకాం, బిజెడ్సీ, బీఏ కోర్సుల్లో చేరాలనుకునే వారు ‘దోస్త్’ (DOST) వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. అభ్యర్థులు మూడు సెట్ల జిరాక్స్ పత్రాలు, 8 ఫొటోలతో సంప్రదించాలని ఆమె పేర్కొన్నారు.
News April 20, 2026
మహబూబ్నగర్: ఇంటి వద్దనే ఎఫ్ఐఆర్: ఎస్పీ

మహబూబ్నగర్ జిల్లాలో బాధితులు పోలీస్ స్టేషన్కు రాకుండానే ఇంటి నుంచే ఫిర్యాదు చేసే వెసులుబాటును ప్రభుత్వం కల్పించిందని ఎస్పీ జానకి తెలిపారు. ముఖ్యంగా మహిళలు, వృద్ధులు, మైనర్లకు ఇది ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. ఈ మేరకు జిల్లాలోని అన్ని పోలీస్ బృందాలకు ఆదేశాలు జారీ చేశామని, ప్రజలు ఈ సౌకర్యాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆమె సూచించారు.
News April 20, 2026
MBNR: అక్కడ.. అత్యధిక ఉష్ణోగ్రత నమోదు

మహబూబ్ నగర్ జిల్లాలో వేసవి ఉష్ణోగ్రతల రోజురోజుకు గణనీయంగా పెరుగుతున్నాయి. గడచిన 24 గంటల్లో గండీడ్ మండలం సల్కర్పేటలో 43.4 డిగ్రీల అత్యధిక ఉష్ణోగ్రత నమోదయింది. కోయిలకొండ మండలం సిరివెంకటాపూర్ 43.3, దేవరకద్ర 43.2, చిన్న చింతకుంట మండలం వడ్డేమాన్ 43.0, భూత్పూర్ మండలం కొత్త మొల్గర 42.6, అడ్డాకుల 42.4, కోయిలకొండ మండలం పారుపల్లి 42.0, చిన్న చింతకుంట 41.8, జడ్చర్ల 41.7 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయింది.


