News September 10, 2025

కాకినాడ: గ్రామాల్లో మొదలైన ఎన్నికల హడావిడి

image

2026 జనవరిలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. తొలిగా పంచాయతీ ఎన్నికలు జరగనుండటంతో గ్రామాల్లో రాజకీయ వాతావరణం వేడెక్కుతోంది. సర్పంచ్ పదవులకు పోటీ చేయాలనుకుంటున్న అభ్యర్థులు తమ ప్రయత్నాలను ప్రారంభించారు. కాకినాడ జిల్లాలో మొత్తం 21 మండలాల పరిధిలో 385 గ్రామ పంచాయతీలు, 4,328 వార్డులు, 430 ఎంపీటీసీ, 20 జడ్పీటీసీ స్థానాలు ఉన్నాయి.

Similar News

News September 10, 2025

GNT: పీజీ పరీక్షల రీవాల్యుయెషన్ ఫలితాలు విడుదల

image

ఆచార్య నాగార్జున యూనివర్సిటీ పరిధిలో జనవరి 2025లో నిర్వహించిన M.com 1, 3వ, MA. రాజనీతి శాస్త్రం, చరిత్ర, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ 1వ సెమిస్టర్ రెగ్యులర్ పరీక్షల రీవాల్యుయెషన్ ఫలితాలు బుధవారం విడుదలయ్యాయి. విద్యార్థులు అధికారిక వెబ్‌సైట్‌లో తమ రిజిస్టర్ నంబర్ ద్వారా రిజల్ట్స్ తెలుసుకోవచ్చు. ఫలితాలకై https://www.nagarjunauniversity.ac.in/ చూడాలని ANU పరీక్షల విభాగం ఒక ప్రకటన విడుదల చేసింది.

News September 10, 2025

రాజీ మార్గమే రాజమార్గం: NGKL ఎస్పీ

image

జాతీయ లోక్ అదాలత్‌ను సద్వినియోగం చేసుకోలాని నాగర్‌కర్నూల్‌ ఎస్పీ గైక్వాడ్ వైభవ్ రంగనాథ్ సూచించారు. ఈనెల 13న జిల్లాలోని అన్ని కోర్టుల్లో జాతీయ లోక్ అదాలత్ నిర్వహిస్తున్నట్లు ఎస్పీ తెలిపారు. రాజీపడదగిన సివిల్, క్రిమినల్ కేసులను ఇరువర్గాల అంగీకారంతో పరిష్కరించుకోవచ్చని సూచించారు. “రాజీ మార్గమే రాజమార్గం” అని పేర్కొంటూ, కేసులను పరిష్కరించుకోవాలని కోరారు.
-SHARE IT

News September 10, 2025

సబిత, సునీత కాంగ్రెస్‌లో చేరట్లేదు: బీఆర్ఎస్ నేత కార్తీక్

image

TG: బీఆర్ఎస్ MLAలు సబితా ఇంద్రారెడ్డి, సునీతా లక్ష్మారెడ్డి కాంగ్రెస్‌లో చేరబోతున్నారనే ప్రచారంలో వాస్తవం లేదని సబిత కుమారుడు, బీఆర్ఎస్ నేత కార్తీక్ స్పష్టతనిచ్చారు. ఇంతకాలం ఇలాంటి తప్పుడు ప్రచారాన్ని తాము పట్టించుకోలేదని, కానీ ఇకపై ఉపేక్షించబోమని తేల్చి చెప్పారు. ఇలాంటి వార్తలను ప్రచురించే వారికి(యూట్యూబ్ ఛానెల్స్) లీగల్ నోటీసులు ఇస్తామని, వాళ్లు కోర్టుల చుట్టూ తిరగాల్సి వస్తుందని హెచ్చరించారు.