News January 24, 2025

కామారెడ్డి: చేపల మార్కెట్ ఏర్పాటు చేయాలని వినతి

image

కామారెడ్డి పట్టణంలో చేపల మార్కెట్ ఏర్పాటు చేయాలని జిల్లా చేపల పెంపకం దారుల సంఘం అధ్యక్షులు మహేందర్ కోరారు. గురువారం కామారెడ్డి పట్టణంలో రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ అలీకి వినతిపత్రం అందజేశారు. అనంతరం మాట్లాడుతూ.. ఎన్నో కుటుంబాలు చేపలు పట్టుకొని జీవిస్తున్నారని తెలిపారు. చేపలు అమ్మేందుకు మార్కెట్ లేకపోవటంతో ఇబ్బందులు పడుతున్నారన్నారు. ప్రత్యేక మార్కెట్ ఏర్పాటు చేయాలని కోరారు.

Similar News

News September 13, 2025

వరంగల్: మావోయిస్టు బాలకృష్ణ అంత్యక్రియలపై మీమాంస..!

image

హనుమకొండ జిల్లా మడికొండ గ్రామానికి చెందిన మావోయిస్టు మోడెం బాలకృష్ణ అంత్యక్రియలపై మీమాంస నెలకొంది. స్వగ్రామం మడికొండ కాగా.. హైదరాబాదులో సైతం వారు ఉండటంతో బాలకృష్ణ అంత్యక్రియలు ఎక్కడ జరుగుతాయని ఆలోచిస్తున్నారు. చాలా సంవత్సరాల క్రితమే హైదరాబాదులో స్థిరపడగా ఇప్పటివరకు మడికొండలో ఎలాంటి ఏర్పాట్లు చేయకపోవడంతో అక్కడే బాలకృష్ణ అంత్యక్రియలు జరుగుతాయని చర్చించుకుంటున్నారు.

News September 13, 2025

ఉలవపాడు: జ్యువెలరీ షాప్ సిబ్బందిని బురిడి కొట్టించిన కిలా(లే)డీలు

image

ఉలవపాడులోని ఓ జ్యువెలరీ షాప్‌లో శుక్రవారం 4 జతల బంగారు కమ్మలు చోరీ అయ్యాయని పోలీసులకు ఫిర్యాదు అందింది. బంగారు కమ్మలు కొనడానికి వచ్చినట్లు నటించిన ఇద్దరు మహిళలు షాపు సిబ్బందిని బురిడి కొట్టించి 4 జతల గోల్డ్ కమ్మలు మాయం చేశారు. ఆ తర్వాత గుర్తించిన షాపు సిబ్బంది రూ.లక్ష విలువైన సొత్తు చోరీ అయిందని పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు SI అంకమ్మ తెలిపారు.

News September 13, 2025

SLBC: ఇకపై DBM పద్ధతిలో తవ్వకం

image

TG: ఈ ఏడాది FEBలో SLBC టన్నెల్ కూలి 8 మంది మరణించిన విషయం తెలిసిందే. దీంతో ఇకపై టన్నెల్ బోరింగ్ మిషన్(TBM)తో తవ్వడం నిలిపివేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. మిగిలిన పనిని డ్రిల్లింగ్-బ్లాస్టింగ్ పద్ధతి(DBM)లోనే చేపట్టనుంది. జలయజ్ఞంలో భాగంగా 2005లో SLBC సొరంగ మార్గం నిర్మాణాన్ని ప్రారంభించారు. 30 నెలల్లో దీన్ని పూర్తిచేసేలా కాంట్రాక్టర్‌తో ఒప్పందం జరగగా ఇప్పటికి 20 ఏళ్లవుతున్నా పూర్తికాలేదు.