News April 14, 2026
కామారెడ్డి జిల్లాలో అత్యధిక ఉష్ణోగ్రత ఎక్కడంటే?

కామారెడ్డి జిల్లాలో ఎండ తీవ్రత కొనసాగుతోంది. తెలంగాణ డెవలప్మెంట్ ప్లానింగ్ సొసైటీ విడుదల చేసిన ఆటోమేటిక్ వాతావరణ కేంద్రాల వివరాల ప్రకారం.. భిక్కనూర్లో అత్యధికంగా 42.9°C ఉష్ణోగ్రత నమోదైంది. బోమనదేవిపల్లి, సోమూర్, జుక్కల్ ప్రాంతాల్లో కూడా 42.8°C వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. జిల్లాలో ఎక్కువ ప్రాంతాల్లో గరిష్ఠ ఉష్ణోగ్రతలు 40°C నుంచి 43°C మధ్య నమోదవ్వడంతో ‘అలర్ట్’ పరిస్థితులు కొనసాగుతున్నాయి.
Similar News
News April 14, 2026
మునగాకుతో ఎన్నో లాభాలు

ఆయుర్వేదంలో మునగకు ఓ ప్రత్యేక స్థానం ఉంది. దీన్ని ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల ఎన్నో లాభాలున్నాయి. NCBI నివేదిక ప్రకారం.. మునగ ఆకుల్లో ప్రొటీన్లు, కార్బోహైడ్రేట్లు, కాల్షియం, పొటాషియం, మెగ్నీషియం, ఐరన్, విటమిన్-ఎ, సి, బి కాంప్లెక్స్, బీటా-కెరోటిన్, అమైనో యాసిడ్స్, ఫినోలిక్లతో పాటు, 40 కంటే ఎక్కువ రకాల యాంటీఆక్సిడెంట్లు ఉన్నాయి. ఇందులో ఉండే పీచు, జీర్ణవ్యవస్థతో పాటు పొట్టను ఆరోగ్యంగా ఉంచుతుంది.
News April 14, 2026
VJA: అంబేద్కర్ స్మృతి వనంలో ఓపెన్ థియేటర్ మూత!

విజయవాడలోని అంబేడ్కర్ స్మృతి వనంలో ఓపెన్ థియేటర్ నిర్వహణ అటకెక్కింది. 90 మంది సామర్థ్యంతో నిర్మించిన ఈ థియేటర్ మరమ్మతుల సాకుతో మూతపడింది. మరోవైపు రూ.404 కోట్ల ప్రాజెక్టులో ఇప్పటివరకు రూ.320 కోట్ల పనులు మాత్రమే పూర్తయ్యాయి. రూ.90 కోట్లతో కళామందిరం సిద్ధమైనా, ఫుడ్ కోర్టు, చిల్డ్రన్ పార్క్ పనులు ఇంకా కొనసాగుతున్నాయి. ప్రభుత్వం ఈ ఓపెన్ థియేటర్ గురించి ప్రచారం చేయకపోవడంపై విమర్శలు వినిసిస్తున్నాయి.
News April 14, 2026
నెల్లూరు: వడదెబ్బతో వ్యక్తి మృతి

ఉదయగిరిలోని దాసరపల్లిలో వడదెబ్బ తగిలి షేక్. మౌలాలి (65) మృతి చెందాడు. పొలానికి నీళ్లు కట్టడానికి 10 గంటల సమయంలో వెళ్లిన మౌలాలి పొలం పనులు ముగించుకొని ఇంటికి చేరుకున్నాడు. కొద్దిసేపటికి స్పృహ తప్పి పడిపోయాడు. సమాచారం అందుకున్న 108 సిబ్బంది ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందాడని వైద్యాధికారులు వెల్లడించారు.


