News March 14, 2025
కేంద్ర మంత్రిని కలిసిన ADB MP

ఆదిలాబాద్ ఎంపీ గోడం నగేశ్ కేంద్ర జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీని కలిశారు. నియోజకవర్గంలోని పలు అభివృద్ధి పనులను ఆయన దృష్టికి తీసుకెళ్లారు. NH44ను భోరజ్ నుంచి మహోర్ వరకు, గుడిహత్నూర్ నుంచి ఆసిఫాబాద్కు పొడింగించాలని విన్నవించారు. పెన్ గంగా&గోదావరి రోడ్డు మీద సేఫ్టీ పనులు త్వరలో పూర్తి చేయాలని కోరారు.
Similar News
News March 14, 2025
స్టార్ క్రికెటర్ కూతురు మృతి

అఫ్గానిస్థాన్ స్టార్ బ్యాటర్ హజ్రతుల్లా జజాయ్ ఇంట తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఆయన రెండేళ్ల కూతురు మరణించినట్లు అఫ్గాన్ జట్టు ఆటగాడు కరీం జనత్ ఇన్స్టా ద్వారా వెల్లడించారు. చిన్నారి ఫొటోను షేర్ చేశారు. అయితే ఆమె ఎలా మరణించిందనేది తెలియరాలేదు. స్టార్ హిట్టర్గా పేరొందిన జజాయ్ T20ల్లో 6 బంతులకు 6 సిక్సర్లు బాదడం, ఫాస్టెస్ట్ ఫిఫ్టీ(12 బంతుల్లో) చేసిన ఆటగాళ్ల జాబితాలో చేరారు.
News March 14, 2025
SKLM: పలాసలో 23న స్వాతంత్ర్య సమరయోధుల సంస్మరణ సభ

పలాస మండలం మా కన్నపల్లి గ్రామంలో భగత్ సింగ్, రాజ్ గురు, సుఖ దేవ్ల సంస్మరణ సభ నిర్వహిస్తున్నట్లు దేశభక్తి ప్రజాతంత్ర ఉద్యమం నాయకులు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ కార్యక్రమం ఈ నెల 23న ఉదయం 10 గంటలకు ప్రారంభం అవుతుందని అన్నారు. ప్రజలు అందరూ పాల్గొని సభను విజయవంతం చేయాలని కోరారు.
News March 14, 2025
Life Time High: భారీగా పెరిగిన బంగారం ధర

బంగారం ధరలు కనీవినీ ఎరుగని స్థాయికి చేరుకుంటున్నాయి. తొలిసారిగా నేడు ఔన్స్ (28.35గ్రా) విలువ $3002ను టచ్ చేసింది. ఇండస్ట్రీ వర్గాలు అంచనా వేసిన $3000 రెసిస్టెన్సీని బ్రేక్ చేసింది. డొనాల్డ్ ట్రంప్ టారిఫ్స్, డాలర్ తగ్గుదల, ట్రేడ్వార్, అనిశ్చితి నేపథ్యంలో ఇన్వెస్టర్లు గోల్డులో పెట్టుబడి పెట్టడమే ఇందుకు కారణాలు. ప్రస్తుతం HYDలో 24K 10Gr ధర నిన్నటితో పోలిస్తే రూ.1200 పెరిగి రూ.₹89,780 వద్ద ఉంది.