News April 14, 2025
గత ప్రభుత్వం సన్న బియ్యం ఇస్తానని ఇవ్వలేక పోయింది: భట్టి

ఖమ్మం: గత ప్రభుత్వం సన్న బియ్యం ఇస్తానని ప్రజలను నమ్మించి ఇవ్వలేకపోయిందని కానీ, తాము అలా కాకుండా ఇచ్చిన హామీని అమలు చేశామని Dy.CM భట్టి విక్రమార్క అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ₹13,523 కోట్లు వెచ్చించి లబ్ధిదారులకు సన్నబియ్యం అందిస్తుందని చెప్పారు. సన్నబియ్యం పక్కదారి పట్టకుండా లబ్ధిదారులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. త్వరలోనే 10 లక్షల మందికి కొత్త రేషన్ కార్డులు మంజూరుచేస్తామన్నారు.
Similar News
News April 15, 2025
పోస్టల్ సర్వీస్నూ వదల్లేదు.. ఎంతకు తెగించార్రా?

గుజరాత్లో మద్య నిషేధం అమల్లో ఉన్న విషయం తెలిసిందే. దీన్ని క్యాష్ చేసుకునేందుకు స్మగ్లర్లు రకరకాల పన్నాగాలు పన్నుతున్నారు. చివరికి పోస్టల్ సర్వీస్నూ వదల్లేదు. యూనియన్ టెరిటరీ దాద్రానగర్ హవేలీలోని దీవ్ నుంచి పోస్ట్ మాస్టర్ సాయంతో మద్యం అక్రమ రవాణాకు పాల్పడ్డారు. పోస్టల్ స్టాంప్ ఉన్న పార్శిల్స్ చెక్ చేయరని ఈ దారి ఎంచుకున్నారు. కానీ బార్డర్లో పోలీసుల తనిఖీల్లో దొరికిపోయారు.
News April 15, 2025
ఉప్పు అధికంగా తీసుకుంటున్నారా?

అవసరానికి మించి ఉప్పు తీసుకోవడం మంచిదికాదని వైద్యులు హెచ్చరిస్తున్నారు. WHO చెప్పినట్లు రోజూ 5 గ్రాముల కంటే తక్కువ ఉప్పు (దాదాపు 2గ్రాముల సోడియం) తీసుకోవాలని తెలిపారు. ఈ మోతాదు మించితే రక్తపోటు, శరీరంలో నీరు చేరడం, గుండె జబ్బులు, స్ట్రోక్, కిడ్నీ సమస్యలు వచ్చే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. సాస్లు, నిల్వ పచ్చళ్లలో ఉప్పు ఎక్కువగా ఉంటుందని, ఆరోగ్యంగా ఉండేందుకు ఉప్పు వాడకాన్ని తగ్గించాలంటున్నారు.
News April 15, 2025
ముస్లింలపై మోదీ వ్యాఖ్యలు.. ఒవైసీ కౌంటర్

హరియాణాలో నిన్న ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలపై AIMIM అధినేత అసదుద్దీన్ ఒవైసీ Xలో విమర్శలు గుప్పించారు. ‘వక్ఫ్ పేరిట దేశంలో లక్షల ఎకరాల భూములున్నాయి. వాటిని సక్రమంగా వినియోగించి ఉంటే ముస్లిం పిల్లలు సైకిల్ పంక్చర్ పనులు చేసుకోవాల్సి వచ్చేది కాదు’ అని మోదీ వ్యాఖ్యానించారు. దీనిపై ఒవైసీ స్పందిస్తూ ‘సంఘ్ పరివార్ ఆస్తులు దేశం కోసం వినియోగించి ఉంటే మోదీ టీ అమ్మాల్సి వచ్చేది కాదు’ అని కౌంటర్ ఇచ్చారు.