News September 13, 2025

గుడిమల్లంలో 22 నుంచి దసరా ఉత్సవాలు

image

పురాతన శైవక్షేత్రమైన గుడిమల్లం శ్రీ ఆనందవల్లి సమేత పరశురామేశ్వర స్వామి ఆలయంలో ఈనెల 22 నుంచి దసరా ఉత్సవాలు ఘనంగా నిర్వహించనున్నారు. 22న కలశ పూజ, 23న బాలాత్రిపుర సుందరి, 24న గాయత్రిదేవి, 25న అన్నపూర్ణ దేవి, 26న ఆనందవల్లి, 27న మహాలక్ష్మి దేవి, 28న లలితా త్రిపుర సుందరీ దేవి, 29న సరస్వతి దేవి, 30న దుర్గాదేవి, 1న మహిషాసుర మర్దిని, 2న రాజరాజేశ్వరీ దేవి అలంకరణలో దర్శనం ఉంటుంది.

Similar News

News September 13, 2025

ఖమ్మం జిల్లాలో 15 నుంచి ప్రైవేట్ విద్యాసంస్థల బంద్

image

ఖమ్మం జిల్లాలో ఈ నెల 15 నుంచి ప్రైవేటు విద్యాసంస్థలు బంద్‌ పాటించనున్నాయి. ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలు విడుదల చేయకపోవటంతో ఈ నిర్ణయం తీసుకున్నామని ప్రైవేటు విద్యాసంస్థల బాధ్యులు మల్లెంపాటి శ్రీధర్ తెలిపారు. ఖమ్మంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. బకాయిలు చెల్లించే వరకు ఆందోళన కొనసాగిస్తామని చెప్పారు. ఈ సమావేశంలో పలు విద్యార్థి సంఘాల నాయకులు పాల్గొన్నారు.

News September 13, 2025

రేపే దాయాదుల పోరు.. సగం టికెట్లే సేల్!

image

UAEలో జరుగుతోన్న ఆసియా కప్‌పై భారత అభిమానుల్లో ఆసక్తి తగ్గిపోయింది. ముఖ్యంగా రేపు జరిగే ఇండియా VS పాకిస్థాన్‌ను బైకాట్ చేయాలంటూ భారత అభిమానులు పోస్టులు పెడుతున్నారు. దీంతో హాట్ కేకుల్లా అమ్ముడవ్వాల్సిన దాయాదుల మ్యాచ్ టికెట్లు ఇప్పటికీ సగం కూడా అమ్ముడవలేదని సమాచారం. అమ్మకాలను పెంచేందుకు నిర్వాహకులు టికెట్ ధరలు కూడా తగ్గించారట. రోహిత్, కోహ్లీ వంటి స్టార్లు లేకపోవడం మరో కారణంగా తెలుస్తోంది.

News September 13, 2025

నిద్రలోనే చనిపోయిన 19 మంది స్టూడెంట్స్

image

మయన్మార్‌లో అంతర్గత ఘర్షణలకు 19 మంది విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారు. శుక్రవారం రాత్రి రఖై రాష్ట్రంలోని క్యాక్తాలో రెండు ప్రైవేట్ స్కూళ్ల‌పై డ్రోన్ల దాడి జరగడంతో 19 మంది స్టూడెంట్స్ నిద్రలోనే కన్నుమూశారు. 22 మంది గాయపడినట్లు అరాకన్ ఆర్మీ తెలిపింది. డ్రోన్లతో బాంబులను జారవిడిచారని, ఇది మయన్మార్ మిలిటరీ పనేనని ఆరోపించింది. కాగా కొన్నాళ్లుగా అరాకన్ ఆర్మీ, మయన్మార్ మిలిటరీ మధ్య ఘర్షణ జరుగుతోంది.