News February 2, 2025
ట్రంప్తో ప్రధాని మోదీ మాట్లాడాలి: కాంగ్రెస్ నేత భార్గవ్
దేశంలో విద్యా, ఉద్యోగ రంగాలలో ప్రగతి లేక సంపన్నులు దేశం వదిలిపోతున్నారని విజయవాడ కాంగ్రెస్ పార్లమెంటరీ నాయకుడు వల్లూరు భార్గవ్ ఆరోపించారు. ఈ మేరకు ఆయన మాట్లాడుతూ.. ప్రధాని మోదీ అమెరికా అధ్యక్షుడు ట్రంప్తో మాట్లాడి అమెరికాలో ఉన్న భారతీయులకు అక్కడ సౌకర్యాలు కల్పించాలని తేదా ఇక్కడ అభివృద్ధిని గురించి అర్థమయ్యేలా చెప్పి వెనక్కి తీసుకురావాలని డిమాండ్ చేశారు.
Similar News
News February 3, 2025
పుట్టిన రోజు శుభాకాంక్షలు
ఈ రోజు పుట్టినరోజు జరుపుకొంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపరచండి.
News February 3, 2025
నెతన్యాహు సతీమణిపై క్రిమినల్ ఇన్వెస్టిగేషన్
ఇజ్రాయెల్ PM నెతన్యాహు సతీమణి సారాపై నేర విచారణ చేస్తున్నట్లు పోలీసులు ప్రకటించారు. ఆయనపై ఉన్న ఓ అవినీతి కేసులో సాక్షులను ఆమె బెదిరించారని మీడియాలో వార్తలు వచ్చాయి. దీంతో క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ చేస్తున్నట్లు స్టేట్ అటార్నీ వెల్లడించింది. తనకు అనుకూలంగా వార్తలు రాసినందుకు కొన్ని మీడియా సంస్థలకు నెతన్యాహు డబ్బులు ఇచ్చారనేది ప్రధాన ఆరోపణ. మోసం, నమ్మకద్రోహం, అవినీతిపై విచారణ జరుగుతోంది.
News February 3, 2025
NGKL: కేంద్ర బడ్జెట్పై నేడు కాంగ్రెస్ నిరనలు
కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో తెలంగాణకు జరిగిన అన్యాయాన్ని నిరసిస్తూ సోమవారం నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలోని కాంగ్రెస్ నిరసనకు పిలుపునిచ్చింది. స్థానిక అంబేడ్కర్ విగ్రహం వద్ద మధ్యాహ్నం 1 నుంచి 2 గంటల వరకు ధర్నా నిర్వహిస్తున్నట్లు ఎమ్మెల్యే, జిల్లా డీసీసీ వంశీకృష్ణ తెలిపారు. ఈ కార్యక్రమంలో యూత్ కాంగ్రెస్, NSUI, జిల్లా ఎమ్మెల్యేలు, ఎంపీలు, నాయకులు, కార్యకర్తలు పాల్గొంటారని చెప్పారు.