News February 3, 2025
నెతన్యాహు సతీమణిపై క్రిమినల్ ఇన్వెస్టిగేషన్

ఇజ్రాయెల్ PM నెతన్యాహు సతీమణి సారాపై నేర విచారణ చేస్తున్నట్లు పోలీసులు ప్రకటించారు. ఆయనపై ఉన్న ఓ అవినీతి కేసులో సాక్షులను ఆమె బెదిరించారని మీడియాలో వార్తలు వచ్చాయి. దీంతో క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ చేస్తున్నట్లు స్టేట్ అటార్నీ వెల్లడించింది. తనకు అనుకూలంగా వార్తలు రాసినందుకు కొన్ని మీడియా సంస్థలకు నెతన్యాహు డబ్బులు ఇచ్చారనేది ప్రధాన ఆరోపణ. మోసం, నమ్మకద్రోహం, అవినీతిపై విచారణ జరుగుతోంది.
Similar News
News February 18, 2025
వచ్చే వారం నుంచే ఎన్టీఆర్-నీల్ సినిమా షూట్?

ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఎన్టీఆర్ 31వ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. ‘డ్రాగన్’ అన్న వర్కింగ్ టైటిల్తో తెరకెక్కే ఈ సినిమా షూటింగ్ వచ్చే వారం నుంచి ప్రారంభం కానుందని సినీ వర్గాల సమాచారం. వికారాబాద్ అడవుల్లో స్టార్ట్ చేయనున్న ఈ తొలి షెడ్యూల్లో ఎన్టీఆర్ పాల్గొనరని భోగట్టా. మూవీ కోసం ఆర్ఎఫ్సీలో ఇప్పటికే భారీ సెట్ తయారవుతోంది. ఆ సెట్లో జరిగే సెకండ్ షెడ్యూల్కు తారక్ వస్తారని తెలుస్తోంది.
News February 18, 2025
బావ కోసం హెలికాప్టర్ ఏర్పాటు చేసిన బావమరిది!

బావమరిది బతుకగోరతాడని సామెత. బిహార్లోని వైశాలి ప్రాంతంలో ఓ బావమరిది తన సోదరి భర్త కోసం ఏకంగా హెలికాప్టర్ ఏర్పాటు చేశాడు. పెళ్లైన తర్వాత తొలిసారిగా అతడి సోదరి భర్తతో పుట్టింటికి వస్తుండటంతో వాళ్లు చాలా గ్రాండ్గా రావాలని పట్నా నుంచి వైశాలి వరకూ 30 కిలోమీటర్ల దూరం మేర హెలికాప్టర్లో తీసుకొచ్చాడు. ఈ వేడుకను తిలకించేందుకు స్థానికులు వారి ఇంటి వద్ద పెద్ద ఎత్తున గుమిగూడారు.
News February 18, 2025
మా వాళ్లు సెమీస్కు వెళ్తే గొప్పే: కమ్రాన్ అక్మల్

పాక్ మాజీ క్రికెటర్ కమ్రాన్ అక్మల్ తన సొంత దేశంపై విమర్శలు గుప్పించారు. పాక్ జట్టు సెమీస్ వరకూ వెళ్తే గ్రేట్ అంటూ ఎద్దేవా చేశారు. ‘మా జట్టులో చాలా లోపాలున్నాయి. సరైన స్పిన్నర్లే లేరు. బ్యాటింగ్, ఫీల్డింగ్లోనూ సమస్యలే. సెలక్షనే సరిగ్గా లేదు. నా దృష్టిలో ఇండియా, న్యూజిలాండ్, సౌతాఫ్రికా, ఇంగ్లండ్ సెమీస్కు చేరతాయి. మా జట్టు సెమీస్కు చేరితే అది గొప్పే’ అని వ్యాఖ్యానించారు.