News February 26, 2025

తూ.గో: జిల్లాలో ఎమ్మెల్సీ పట్టభద్రుల ఓటర్లు 62,970

image

ఎమ్మెల్సీ పట్టభద్రుల నియోజకవర్గ ఎన్నికల్లో తూ.గో జిల్లాలో 62,970 మంది ఓటర్లు తమ ఓటు హక్కును సద్వినియోగం చేసుకోనున్నట్లు జిల్లా కలెక్టర్ ప్రశాంతి మంగళవారం ప్రకటించారు. జిల్లా వ్యాప్తంగా ఈ నెల 27న జరగనున్న ఎన్నికలకు 92 పోలింగ్ కేంద్రాలను 15 రూట్‌లలో ఏర్పాటు చేశామన్నారు. మొత్తం ఓటర్లలో పురుషులు 36,366 మంది, స్త్రీలు 27,601 మంది ఇతరులు ముగ్గురు ఉన్నారన్నారు.

Similar News

News February 26, 2025

మృతదేహాలు కొవ్వూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలింపు

image

తాళ్లపూడి మండలం తాడిపూడి గ్రామం అంతా మహా శివరాత్రి పర్వదినాన ఆ గ్రామం అంతా విషాదంతో నిండిపోయింది. నది స్థానానికి దిగిన 11 మందిలో ఐదుగురు గల్లంతయి మృత్యువాత పడ్డారు. దీంతో కలెక్టర్ ప్రశాంతి ఉదయం నుంచి అధికారులను అప్రమత్తం చేశారు. ఈ నేపథ్యంలో క్షేత్రస్థాయిలో ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ ఎన్డీఆర్ఎఫ్ బృందాలు సహాయంతో వెలికితీసిన మృతదేహాలను పంచనామా నిమిత్తం కొవ్వూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

News February 26, 2025

ధవళేశ్వరం: స్నేహబంధం.. ఇలా చెదిరిపోయింది

image

వారిద్దరిది ఒకే ఊరు.. ఒకే ప్రాంతం. పక్క పక్కనే ఇళ్లు, ఒకరిని వదిలి ఒకరు ఉండలేని స్నేహబంధం వారిది. అయితే మృత్యువు రూపంలో ఆ బంధం చెదిరిపోయింది. వివరాలు ఇలా.. ధవళేశ్వరం జాలరి పేటకు చెందిన ప్రాణ స్నేహితులు నాగమళ్ల ముత్యాలు(19), బొడ్డు వెంకటేష్ (16) మంగళవారం బైక్‌పై వెళుతూ ఆర్టీసీ బస్సును ఢీకొన్న ప్రమాదంలో స్పాట్‌లోనే మరణించారు. ఈ దుర్ఘటన చూసిన వారు స్నేహబంధం ఇలా విడిపోయిందంటూ కన్నీరు పెట్టుకున్నారు.

News February 26, 2025

27న విద్యాసంస్థలకు సెలవు: డీఈఓ

image

ఉమ్మడి గోదావరి జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు గురువారం నిర్వహించనున్న నేపథ్యంలో ప్రభుత్వ, ప్రైవేటు, ఎయిడెడ్ పాఠశాలలకు రాష్ట్ర ప్రభుత్వ పాఠశాల విద్యా కమిషనర్‌ సెలవు ప్రకటించినట్లు డీఈఓ వాసుదేవరావు తెలిపారు. మంగళవారం ఈ మేరకు ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. జిల్లాలోని ఉప విద్యాశాఖ అధికారులకు, ఎంఈఓలు, అన్ని విద్యా సంస్థలకు దీనిపై సర్క్యులర్ అందించినట్లు వివరించారు.

error: Content is protected !!