News April 4, 2025
నంద్యాలలో ఈనెల 10న జాబ్ మేళా

ఏపీ రాష్ట్ర నైపుణ్యాభివృద్ది సంస్థ ఆధ్వర్యంలో నంద్యాల ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఆవరణలో ఏప్రిల్ 10న జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి తెలిపారు. ఈ జాబ్ మేళాకు 14 ప్రైవేటు కంపెనీల ప్రతినిధులు హాజరవుతారని చెప్పారు. పదవ తరగతి, ఐటీఐ, డిప్లొమా, ఇంటర్, డిగ్రీ, B.Tech (Mechanical), B/D/M.Pharmacy, పీజీ పూర్తిచేసిన అభ్యర్థులు అర్హులన్నారు.
Similar News
News January 1, 2026
జిల్లా వ్యవసాయాధికారిగా రాబర్ట్ పాల్ బాధ్యతలు

జిల్లా వ్యవసాయాధికారిగా కె. రాబర్ట్ పాల్ గురువారం బాధ్యతలు స్వీకరించారు. మాధవరావు బుధవారం పదవీ విరమణ చేయడంతో, ఆత్మ ప్రాజెక్ట్ మేనేజర్గా ఉన్న రాబర్ట్ పాల్ ఇన్ఛార్జ్ ఏవోగా నియమితులయ్యారు. ఈ సందర్భంగా రాజమహేంద్రవరం ఏడీఏ సూర్య రమేశ్, ఏఈఓ సంఘం అధ్యక్షుడు వేణుమాధవ్ ఆయనను మర్యాదపూర్వకంగా కలిసి అభినందనలు తెలిపారు. రైతులకు మెరుగైన సేవలు అందించడమే తన లక్ష్యమని ఈ సందర్భంగా రాబర్ట్ పాల్ పేర్కొన్నారు.
News January 1, 2026
MBNR: రోడ్డు భద్రత అవగాహన మాసోత్సవాలు ప్రారంభం

మహబూబ్నగర్ జిల్లా కలెక్టరేట్ ప్రాంగణంలో అదనపు కలెక్టర్(రెవెన్యూ) మధుసూదన్ నాయక్ 37వ రోడ్డు భద్రత అవగాహన మాసోత్సవాల కార్యక్రమాన్ని పచ్చ జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా రోడ్డు భద్రతా నినాదాలు, పోస్టర్లతో అలంకరించిన వాహనంను పచ్చ జెండా ఊపి కార్యక్రమాన్ని అధికారికంగా ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ..రవాణా శాఖ ఆధ్వర్యంలో నేటి నుంచి నెలరోజుల పాటు రోడ్డు భద్రతపై అవగాహన కల్పించాలన్నారు.
News January 1, 2026
ఇతిహాసాలు క్విజ్ – 114 సమాధానం

ఈరోజు ప్రశ్న: రావణుడి సోదరి ఎవరు? ఆమె భర్త పేరేంటి? ఆయనను ఎవరు చంపేశారు?
సమాధానం: రావణుడి సోదరి శూర్పణఖ. ఆమె భర్త పేరు విద్యుజ్జిహ్వుడు. అతను రావణుడికి వ్యతిరేకంగా యుద్ధం చేయడంతో, ఆగ్రహించిన రావణుడు సొంత బావ అని చూడకుండా సంహరించాడు. భర్తను కోల్పోయిన బాధ వల్లే శూర్పణఖ తిరుగుతూ అరణ్యంలో రాముడిని చూసి మోహించింది.
<<-se>>#Ithihasaluquiz<<>>


