News September 12, 2025

నస్రుల్లాబాద్: వ్యభిచార గృహంపై దాడి.. ముగ్గురి అరెస్ట్

image

నస్రుల్లాబాద్ మండల కేంద్రంలోని పోచమ్మ కాలనీలో వ్యభిచార గృహంపై పోలీసులు దాడి చేసి ముగ్గురు నిందితులను అరెస్టు చేశారు. పక్కా సమాచారంతో ఎస్సై రాఘవేంద్ర, తన సిబ్బందితో కలిసి వ్యభిచార గృహంపై దాడి చేసి వారి వద్ద నుంచి 3 మొబైల్స్, రూ.500 నగదు స్వాధీనం చేసుకున్నట్లు SI వెల్లడించారు. కేసు నమోదు చేసినట్లు వెల్లడించారు.

Similar News

News April 13, 2026

హైడ్రా కూల్చివేతలు యుద్ధాన్ని తలపిస్తున్నాయి: హైకోర్టు

image

TG: తదుపరి ఆదేశాలు ఇచ్చే వరకూ ఎలాంటి కూల్చివేతలు చేపట్టవద్దని హైడ్రాను హైకోర్టు ఆదేశించింది. ‘హైడ్రాకు ఇప్పటివరకు విధివిధానాలు లేవు. కూల్చివేతలు యుద్ధాన్ని తలపిస్తున్నాయి. చెరువులు, రోడ్లు, పార్కులు ఆక్రమిస్తే కూల్చివేయాలి. నోటీసులు ఇవ్వకుండా ఇష్టానుసారం కూల్చివేస్తున్నారు’ అని మండిపడింది. కోర్టును ఆశ్రయించిన పిటిషనర్లు అమీన్‌పూర్‌లో చేపట్టిన కూల్చివేతల వీడియోలను జడ్జికి సమర్పించారు.

News April 13, 2026

హైడ్రా కూల్చివేతలు యుద్ధాన్ని తలపిస్తున్నాయి: హైకోర్టు

image

TG: తదుపరి ఆదేశాలు ఇచ్చే వరకూ ఎలాంటి కూల్చివేతలు చేపట్టవద్దని హైడ్రాను హైకోర్టు ఆదేశించింది. ‘హైడ్రాకు ఇప్పటివరకు విధివిధానాలు లేవు. కూల్చివేతలు యుద్ధాన్ని తలపిస్తున్నాయి. చెరువులు, రోడ్లు, పార్కులు ఆక్రమిస్తే కూల్చివేయాలి. నోటీసులు ఇవ్వకుండా ఇష్టానుసారం కూల్చివేస్తున్నారు’ అని మండిపడింది. కోర్టును ఆశ్రయించిన పిటిషనర్లు అమీన్‌పూర్‌లో చేపట్టిన కూల్చివేతల వీడియోలను జడ్జికి సమర్పించారు.

News April 13, 2026

బాపట్ల: కలెక్టర్ PGRSకు 181 అర్జీలు

image

బాపట్ల కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన పీజీఆర్‌ఎస్ కార్యక్రమంలో వచ్చిన అర్జీలను తక్షణమే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ డా. వినోద్ కుమార్ ఆదేశించారు. మొత్తం 181 అర్జీలు నమోదు కాగా, ప్రతి వినతిని క్షుణ్ణంగా పరిశీలించి పరిష్కారం చూపాలని అధికారులకు సూచించారు. మండల స్థాయి అధికారులతో వీడియో సమావేశం నిర్వహించి పెండింగ్ సమస్యలపై చర్చించారు. కార్యక్రమంలో జేసీ భావన వశిష్ఠ తదితరులు ఉన్నారు.