News September 12, 2025

నస్రుల్లాబాద్: వ్యభిచార గృహంపై దాడి.. ముగ్గురి అరెస్ట్

image

నస్రుల్లాబాద్ మండల కేంద్రంలోని పోచమ్మ కాలనీలో వ్యభిచార గృహంపై పోలీసులు దాడి చేసి ముగ్గురు నిందితులను అరెస్టు చేశారు. పక్కా సమాచారంతో ఎస్సై రాఘవేంద్ర, తన సిబ్బందితో కలిసి వ్యభిచార గృహంపై దాడి చేసి వారి వద్ద నుంచి 3 మొబైల్స్, రూ.500 నగదు స్వాధీనం చేసుకున్నట్లు SI వెల్లడించారు. కేసు నమోదు చేసినట్లు వెల్లడించారు.

Similar News

News September 12, 2025

మదనపల్లె: ఇళ్లల్లో చోరీలకు పాల్పడే దొంగకు రెండేళ్ల జైలు

image

ఇళ్లల్లో చోరీలకు పాల్పడే దొంగకు రెండేళ్ల జైలు శిక్ష విధిస్తూ మదనపల్లె రెండవ అదనపు జ్యుడీసియల్ కోర్టు జడ్జి గురువారం తీర్పు ఇచ్చినట్లు టూ టౌన్ సీఐ రాజారెడ్డి తెలిపారు. మదనపల్లె టూ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో 2021లో రెండు ఇళ్లల్లో దొంగతనం చేసిన కేసులో చీకిలగుట్టలో ఉండే కావడి సోమశేఖర్‌ను అప్పటి పోలీసులు అరెస్టు చేశారు. కేసు విచారణ జరిగి, నేరం రుజువుకావడంతో శిక్ష పడింది.

News September 12, 2025

బజరంగ్‌ పునియా తండ్రి కన్నుమూత

image

భారత రెజ్లర్, ఒలింపిక్ మెడల్ విజేత బజరంగ్‌ పునియా ఇంట్లో విషాదం చోటుచేసుకుంది. ఆయన తండ్రి బల్వాన్ పునియా ఊపిరితిత్తుల సమస్యతో కన్నుమూశారు. ఢిల్లీలోని గంగారాం ఆస్పత్రిలో గత 18 రోజులుగా చికిత్స పొందుతున్న ఆయన నిన్న సాయంత్రం తుదిశ్వాస విడిచారు. తమను ఈ స్థాయికి తీసుకొచ్చేందుకు తన తండ్రి చాలా కష్టపడ్డారని, కుటుంబానికి ఆయనే వెన్నెముక అని బజరంగ్‌ సోషల్ మీడియాలో ఎమోషనల్ పోస్ట్ పెట్టారు.

News September 12, 2025

కృష్ణ-VKB రైల్వేలైన్ పనులు చేపట్టాలి- CM

image

కృష్ణ- వికారాబాద్ రైల్వే లైన్ పనులను త్వరగా చేపట్టేలా చర్యలు తీసుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. పెండింగ్ రైల్వే ప్రాజెక్టులు, భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా చేపట్టాల్సిన ప్రాజెక్టులపై దక్షిణ మధ్య రైల్వే అధికారులతో సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. కొత్తగా నిర్మించే వికారాబాద్ – కృష్ణ రైల్వే ప్రాజెక్ట్ ద్వారా కొడంగల్, నారాయణపేట, మక్తల్, పరిగి ప్రాంతాల ప్రజలకు మేలు జరగనుంది.