News February 8, 2025

పార్వతీపురం: ఇంటర్మీడియట్ ప్రయోగ పరీక్షలకు హాల్ టిక్కెట్లు సిద్ధం

image

పార్వతీపురం జిల్లాలో ఇంటర్మీడియట్ ఎంపీసీ, బైపీసీ గ్రూపుల్లో చదువుతున్న విద్యార్థులకు ప్రయోగ పరీక్షలు జరగనున్న విషయం తెలిసింది. వీరి హాల్ టికెట్లను కళాశాల లాగిన్ లోను, ఇంటర్మీడియట్ బోర్డ్ వెబ్సైట్లో పొందుపరిచామని పార్వతీపురం మన్యం జిల్లా ఇంటర్మీడియట్ విద్యా అధికారి డి. మంజులవీణ శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. 

Similar News

News February 8, 2025

మెదక్: కత్తితో పొడిచి పారిపోయిన వ్యక్తి అరెస్టు

image

భార్య, బామ్మార్దిని కత్తితో పొడిచి పారిపోయిన వ్యక్తిని అరెస్టు చేసినట్లు రేగోడ్ ఎస్ఐ పోచయ్య తెలిపారు. రేగోడ్‌కు చెందిన ద్యారంగుల వెంకయ్య ఈ నెల 3న భార్యతో గోడవపడ్డాడు. ఈ ఘటనలో భార్య నాగమణి, బావ మరిది గురువయ్యను వెంకయ్య కత్తితో పొడిచి పారిపోయాడు. గాయపడిన ఇద్దరిని సంగారెడ్డి ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. నిందితుడు వెంకయ్యను శుక్రవారం అరెస్టు చేసి రిమండ్ తరలించిన పోలీసులు తెలిపారు.

News February 8, 2025

ఆలేరు: బస్సులో కండక్టర్ పుస్తెలతాడు చోరీ..

image

జనగాం నుంచి ఉప్పల్ ఎక్స్ రోడ్ వెళ్లే బస్సులో పుస్తెలతాడు అపహరించిన ఘటన శుక్రవారం చోటుచేసుకుంది. జనగాం డిపోకు చెందిన TS27Z0028 నంబర్‌గల బస్సులో మహిళా కండక్టర్ ఉమామహేశ్వరికి చెందిన సుమారు మూడు తులాల పుస్తెలతాడును గుర్తుతెలియని వ్యక్తులు దొంగిలించారు. దీనిపై మహేశ్వరి ఆలేరు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

News February 8, 2025

కొత్త ఐటీ బిల్లుకు క్యాబినెట్ ఆమోదం!

image

1961 నాటి ఆదాయపు పన్ను చట్టం స్థానంలో కొత్త బిల్లుకు కేంద్ర క్యాబినెట్ ఆమోదం తెలిపినట్లు అధికార వర్గాలు తెలిపాయి. దీన్ని సోమవారం లోక్‌సభలో ప్రవేశపెట్టనున్నట్లు పేర్కొన్నాయి. అనంతరం పార్లమెంట్ స్టాండింగ్ కమిటీకి పంపించనున్నట్లు తెలిపాయి. ఈ చట్టంలో అందరికీ అర్థమయ్యేలా సంక్షిప్తంగా IT రేట్లు, శ్లాబులు, TDS నిబంధనలు ఉంటాయని ఆర్థికమంత్రి నిర్మల ప్రకటించిన విషయం తెలిసిందే.

error: Content is protected !!