News February 24, 2025

పార్వతీపురం జిల్లాలో 17,849 మంది ఇంటర్మీడియట్ విద్యార్థులు

image

పార్వతీపురం జిల్లాలో 17,849 మంది ఇంటర్మీడియట్ విద్యార్థులు పరీక్షలకు హాజరుకానున్నారని DVEO మంజుల వీణ తెలిపారు. ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేశారు. మార్చి 1 నుంచి జిల్లా వ్యాప్తంగా 34 పరీక్ష కేంద్రాలలో పరీక్షలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. 500 మంది ఇన్విజిలేటర్లు, 34 మంది పర్యవేక్షకులు, ఇద్దరు సిట్టింగ్ స్క్వాడ్, ఒక ఫ్లయింగ్ స్క్వాడ్‌తో పర్యవేక్షణ నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు.

Similar News

News February 24, 2025

మహిళలకు GOOD NEWS.. కొత్త పథకాలు

image

TG: అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మార్చి 8న మరిన్ని పథకాలను ప్రారంభించేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. జిల్లా కేంద్రాల్లో మహిళలకు పెట్రోల్ బంకులు, గ్యాస్ ఏజెన్సీలను ఇప్పించేందుకు చమురు సంస్థలతో చర్చిస్తోంది. అంగన్వాడీ టీచర్లు, హెల్పర్ల రిటైర్మెంట్ ప్రయోజనాలను రూ.2 లక్షలు, రూ.లక్షకు పెంచనుంది. డ్వాక్రా మహిళలకు వడ్డీ రాయితీ చెక్కులు, అంగన్వాడీలు, సహాయ సంఘాల సభ్యులకు చీరలు అందించనుంది.

News February 24, 2025

తాను చనిపోతూ ఐదుగురికి ప్రాణదానం

image

కనగల్ మండలం రేగట్టే గ్రామానికి చెందిన తిరందాసు నారాయణ తను చనిపోతూ మరో ఐదుగురికి ప్రాణదానం చేశారు. చండూరులో కిరాణా షాప్ నడిపే నారాయణ ఈనెల 19న షాపు మూసి బైక్‌పై ఇంటికి వస్తుండగా రేగట్టే కురంపల్లి మధ్య బీటీ రోడ్డుపై అదుపుతప్పి పడడంతో తలకు తీవ్ర గాయాలయ్యాయి. చికిత్స నిమిత్తం హైదరాబాద్‌కు తీసుకెళ్లగా బ్రెయిన్ డెడ్ అయినట్లు వైద్యులు నిర్ధారించారు. బంధువుల అంగీకారంతో నారాయణ అవయవాలను వైద్యులు సేకరించారు.

News February 24, 2025

తాను చనిపోతూ ఐదుగురికి ప్రాణదానం

image

కనగల్ మండలం రేగట్టే గ్రామానికి చెందిన తిరందాసు నారాయణ తను చనిపోతూ మరో ఐదుగురికి ప్రాణదానం చేశారు. చండూరులో కిరాణా షాప్ నడిపే నారాయణ ఈనెల 19న షాపు మూసి బైక్‌పై ఇంటికి వస్తుండగా రేగట్టే కురంపల్లి మధ్య బీటీ రోడ్డుపై అదుపుతప్పి పడడంతో తలకు తీవ్ర గాయాలయ్యాయి. చికిత్స నిమిత్తం హైదరాబాద్‌కు తీసుకెళ్లగా బ్రెయిన్ డెడ్ అయినట్లు వైద్యులు నిర్ధారించారు. బంధువుల అంగీకారంతో నారాయణ అవయవాలను వైద్యులు సేకరించారు.

error: Content is protected !!