News March 28, 2025

పాలమూరు: ‘వంద గజాల ప్లాటుకు రూ.3,81,26,542 LRS’

image

MBNR మున్సిపాలిటీ పరిధిలో విచిత్రం చోటుచేసుకుంది. బాధితుడు తెలిపిన వివరాలు.. పట్టణానికి చెందిన తిరుపతయ్యకు 100 గజాల స్థలం ఉంది. ఆ ప్లాటుకు రూ.3,81,26,542 LRS చలాన్ వచ్చింది. అవాక్కయిన తిరుపతయ్య వెంటనే మున్సిపల్ అధికారులను సంప్రదించారు. ఇదేంటంటూ వాకబు చేశారు. పొరపాటు జరిగిందంటూ LRSను రూ.12,009కి కుదించారు. అయితే తన పక్కనే ఉన్న 100 గజాల ప్లాట్‌కు రూ.9,380 మాత్రమే వచ్చిందని తిరుపతయ్య తెలిపారు.

Similar News

News March 31, 2025

నీలంవాగు సమీపంలో అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి

image

అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి చెందిన ఘటన నారాయణఖేడ్ నియోజకవర్గం కల్హేర్ మండలం పరిధిలోని నీలంవాగు సమీపంలో సోమవారం చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. పోమ్యనాయక్ తండ గ్రామపంచాయతీ కొచ్చేరి తాండకు చెందిన హరి సింగ్ నీలం వాగు సమీపంలో అనుమానాస్పద స్థితిలో మృతిచెందాడు. మృతదేహం గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు.

News March 31, 2025

ముస్లిం సోదరులకు గవర్నర్, సీఎం రంజాన్ శుభాకాంక్షలు

image

AP: రాష్ట్రంలోని ముస్లింలకు గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్, CM చంద్రబాబు, మాజీ CM జగన్ పవిత్ర రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలు అల్లా దయతో విజయవంతం కావాలని CM కోరారు. జకాత్ పేరుతో సాటివారిని ఆదుకునే దయా గుణం ముస్లిం వర్గంలోని మానవత్వానికి ప్రతిరూపం అన్నారు. అల్లా చూపిన మార్గంలో న‌డవాల‌ని, అంద‌రిపై ఆయన దీవెనలు ఉండాల‌ని కోరుకుంటున్నట్లు జగన్ పేర్కొన్నారు.

News March 31, 2025

గాయం నుంచి ఇంకా కోలుకోలేదు: హీరోయిన్

image

జిమ్ చేస్తూ గాయపడిన తాను ఇంకా పూర్తిగా కోలుకోలేదని హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ అన్నారు. గత ఏడాది చివర్లో ఆమె వెయిట్ లిఫ్ట్ చేసే క్రమంలో గాయపడ్డారు. తాను చాలా విషయాల్లో మరింత జాగ్రత్తగా వ్యవహరించాల్సిన అవసరం ఉందని ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. అయితే ప్రతికూల పరిస్థితుల్లోనూ కమిట్ అయిన సినిమాలను తాను పూర్తి చేసినట్లు పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ అమ్మడు తెలుగు సినిమాలకు దూరమయ్యారు.

error: Content is protected !!