News March 1, 2025
బాపట్ల జిల్లా పరీక్షా కేంద్రాల వద్ద పటిష్ఠ భద్రత

ఇంటర్మీడియట్ పరీక్ష కేంద్రాల వద్ద పటిష్ఠ భద్రత కల్పిస్తున్నట్లు ఎస్పీ తుషార్ డూడి పేర్కొన్నారు. జిల్లాలోని ప్రతి పరీక్షా కేంద్రాల వద్ద గడ్డి బందోబస్తు చేపట్టామన్నారు. పరీక్షా కేంద్రాల వద్ద జిరాక్స్ సెంటర్లను మూసి వేయించామని, మాస్ కాపీ ఎక్కువ అవకాశం లేకుండా చర్యలు చేపట్టామన్నారు. అలాగే పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు చేస్తున్నామన్నారు.
Similar News
News March 1, 2025
తిరుపతి జిల్లాలో 92.42 శాతం ఫించన్ పంపిణీ పూర్తి

ఎన్టీఆర్ భరోసా సామాజిక భద్రత పెన్షన్ల పంపిణీ జిల్లావ్యాప్తంగా కొనసాగుతుంది. ఉదయం నుంచి మధ్యాహ్నం 12.40 వరకు జిల్లాలో 92.42 శాతం పంపిణీ పూర్తి అయినట్లు అధికారులు వెల్లడించారు. యర్రావారిపాలెం 95.15 శాతంతో ముందు స్థానంలో ఉండగా పిచ్చాటూరు 88.64 శాతంతో చివరి స్థానంలో నిలిచింది. సాయంత్రానికి 100 శాతం పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ అధికారులను ఆదేశించారు.
News March 1, 2025
పరీక్ష లేకుండా ఉద్యోగాలు.. ఎల్లుండే లాస్ట్ డేట్

పోస్టల్ శాఖలో బీపీఎం, ఏబీపీఎం పోస్టులకు దరఖాస్తు గడువు ఈ నెల 3తో ముగియనుంది. మొత్తం 21,413 ఖాళీలకుగాను ఏపీలో 1,215, తెలంగాణలో 519 పోస్టులు ఉన్నాయి. రాతపరీక్ష లేకుండా టెన్త్ క్లాస్ మార్కుల ఆధారంగా ఎంపిక చేస్తారు. 18-40 ఏళ్ల వారు అర్హులు కాగా రిజర్వేషన్ బట్టి వయోసడలింపు ఉంది. ఈ నెల 6 నుంచి 8 వరకు తప్పుల సవరణకు పోస్టల్ శాఖ అవకాశం కల్పించింది.
వెబ్సైట్: https://indiapostgdsonline.gov.in/
News March 1, 2025
అనకాపల్లి: 89.46 శాతం పింఛన్లు పంపిణీ

అనకాపల్లి జిల్లాలో మధ్యాహ్నం 12.10 గంటల వరకు ఎన్టీఆర్ భరోసా పథకం కింద 89.46 శాతం పింఛన్లు పంపిణీ చేసినట్లు అధికారులు తెలిపారు. సబ్బవరం మండలంలో 95.40 శాతం, కె.కోటపాడు మండలంలో 93.82 మునగపాక మండలంలో 93.05, దేవరాపల్లిలో 92.93, ఎలమంచిలి మున్సిపాలిటీలో 92.72 పింఛన్లను పంపిణీ చేసినట్లు తెలిపారు. అలాగే కసింకోట మండలంలో 92.36, చోడవరం మండలంలో 92.3, పరవాడలో 91.94 శాతం పింఛన్లను పంపిణీ చేశారు.