News March 7, 2025
భానుడి భగభగలు.. మండలాల్లో తీవ్ర వడగాల్పులు

అనకాపల్లి జిల్లాలోని పలు మండలాల్లో శుక్రవారం తీవ్ర వడగాల్పులు వీచే అవకాశముంది. ఆ మేరకు ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ గురువారం వాతావరణ హెచ్చరిక జారీ చేసింది. గురువారం నాతవరంలో 39.9°C అధిక ఉష్ణోగ్రతలు నమోదైనట్లు వెల్లడించారు. గుండె జబ్బులు, షుగర్, బీపీ ఉన్నవారు ఎండలో తిరగకూడదని, శారీరక శ్రమతో కూడిన కఠినమైన పనులను ఎండలో చేయరాదని విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ కూర్మనాథ్ సూచించారు.
Similar News
News March 7, 2025
పాకిస్థాన్కు డొనాల్డ్ ట్రంప్ బిగ్ షాక్?

పాకిస్థాన్, అఫ్గానిస్థాన్ నుంచి అమెరికాకు వచ్చేవారిని అడ్డుకోవాలని ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే వీరిపై ట్రావెల్ బ్యాన్ అమలు చేయాలని యోచిస్తున్నట్లు సమాచారం. కాగా 2016లోనూ ట్రంప్ కొన్ని ముస్లిం దేశాలపై ట్రావెల్ బ్యాన్ విధించారు. 2020లో ట్రంప్ నిర్ణయాన్ని అప్పటి అధ్యక్షుడు జో బైడెన్ రద్దు చేశారు. ఆయా దేశాలకు చెందినవారికి USలోకి ప్రవేశం కల్పించారు.
News March 7, 2025
NZB: PCPNDT టాస్క్ ఫోర్స్ బృందo తనిఖీలు

NZBలో PCPNDT టాస్క్ ఫోర్స్ బృందం సభ్యులు తనిఖీలు చేశారు. ఈ మేరకు గురువారం మెడికవర్, మనోరమ ఆసుపత్రులను ఆరుగురు సభ్యులతో కూడిన బృందం తనిఖీ చేసినట్లు DMHO డాక్టర్ రాజశ్రీ తెలిపారు. జిల్లా రిజిస్ట్రేషన్ అథారిటీ DMHO వద్ద నమోదు చేయించుకున్న స్కానింగ్ మిషన్లను రిజిస్టర్ అయిన డాక్టర్స్ మాత్రమే స్కానింగ్ చేయాలని ఆమె సూచించారు. ఒకవేళ ఏదైనా మార్పులు ఉంటే తమ దృష్టికి తీసుకురావాలని పేర్కొన్నారు.
News March 7, 2025
దేశానికి యువత ఎక్స్ఫ్యాక్టర్: PM మోదీ

భారత్ నేడు ప్రపంచ వృద్ధిని నడిపిస్తోందని, యువత దేశానికి ఎక్స్ఫ్యాక్టర్ అని PM మోదీ అన్నారు. దేశ భద్రతపై NDA ఎంతో శ్రద్ధ చూపుతోందని ఢిల్లీలో జరిగిన ఓ ప్రోగ్రాంలో వివరించారు. గ్రామాల్లో నక్సలిజం తుడిచిపెట్టుకుపోతే, పట్టణ ప్రాంతాల్లో వ్యాపిస్తోందన్నారు. కొన్ని రాజకీయ పార్టీల మాటల్లో నక్సలిజం భావజాలం కన్పిస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు. దేశంలో స్లీపర్ సెల్స్, ఉగ్రదాడులు అదృశ్యమైనట్లు చెప్పారు.