News April 2, 2026
మూసీ ప్రక్షాళనకు లైన్ క్లియర్.. ఎన్జీటీలో పిటిషన్ కొట్టివేత

మూసీ సుందరీకరణలో భాగంగా నిర్మించ తలపెట్టిన ‘గాంధీ సరోవర్’పై NGT పచ్చజెండా ఊపింది. పర్యావరణ అనుమతుల సాకుతో ప్రాజెక్టును అడ్డుకోవాలని BRS నేత వేసిన పిటిషన్ను ట్రిబ్యునల్ కొట్టేసింది. ఇది కేవలం రాజకీయ దురుద్దేశమేనన్న ప్రభుత్వ న్యాయవాదుల వాదనతో ఏకీభవించింది. దీంతో న్యాయపరమైన అడ్డంకులు తొలగి, మూసీ ప్రక్షాళన పనులకు మార్గం సుగమమైంది. ఇక పనులు పరుగులు పెట్టడమే ఉంది.
Similar News
News April 20, 2026
కొడంగల్: CM ఇలాకాలో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గం కొడంగల్లో రూ.224 కోట్లతో 450 పడకల సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని నిర్మిస్తున్నారు. కాగా, రాష్ట్రంలోని పెద్ద సర్కార్ దవాఖానాలైన గాంధీ (2,000+ పడకలు), ఉస్మానియా (1,168+ పడకలు) తర్వాత, ప్రాంతీయ స్థాయిలో ఇంతటి ఆధునిక వైద్యశాల రావడం ఇదే తొలిసారి. ఈ భారీ నిర్మాణం పూర్తయితే కొడంగల్తో పాటు పరిసర జిల్లాలకు ఎంతో ఉపయోగపడనుంది.
News April 20, 2026
కొడంగల్: CM ఇలాకాలో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గం కొడంగల్లో రూ.224 కోట్లతో 450 పడకల సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని నిర్మిస్తున్నారు. కాగా, రాష్ట్రంలోని పెద్ద సర్కార్ దవాఖానాలైన గాంధీ (2,000+ పడకలు), ఉస్మానియా (1,168+ పడకలు) తర్వాత, ప్రాంతీయ స్థాయిలో ఇంతటి ఆధునిక వైద్యశాల రావడం ఇదే తొలిసారి. ఈ భారీ నిర్మాణం పూర్తయితే కొడంగల్తో పాటు పరిసర జిల్లాలకు ఎంతో ఉపయోగపడనుంది.
News April 20, 2026
HYDలో త్వరలో మరో IVF సెంటర్

HYD హైకోర్టు సమీపంలోని పేట్లబురుజు ప్రసూతి ఆస్పత్రిలో త్వరలో IVF కేంద్రం అందుబాటులోకి రానుంది. గాంధీ ఆసుపత్రిలో IVF సెంటర్ సక్సెస్ అయిన నేపథ్యంలో ఇక్కడా ఏర్పాటు చేయాలని యోచిస్తున్నట్లు DME నరేందర్ కుమార్ తెలిపారు. సుమారుగా 490 పడకల సామర్థ్యంతో, డాక్టర్లతో అద్భుతమైన సేవలు అందుబాటులో ఉంటాయన్నారు. ప్రెగ్నెన్సీ పరీక్షలు చేయడం, పసిపిల్లలకు వైద్యం, పిల్లల తల్లులకు అడ్వాన్స్డ్ వైద్యం అందించనున్నారు.


