News January 12, 2026
మెదక్: ప్రజావాణిని సద్వినియోగం చేసుకోవాలి: అదనపు కలెక్టర్

కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమాన్ని ప్రజలు సమస్యల పరిష్కారానికి సమర్థంగా ఉపయోగించుకోవాలని అదనపు కలెక్టర్ నగేశ్ తెలిపారు. సమావేశ మందిరంలో వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల నుంచి మొత్తం 44 అర్జీలను స్వీకరించారు. ఇందులో భూభారతి-32, పెన్షన్-2, ఇందిరమ్మ ఇళ్లు-2, ఇతర సమస్యలపై- 9 దరఖాస్తులు వచ్చినట్లు చెప్పారు. వచ్చిన అర్జీలను వెంటనే పరిశీలించి పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.
Similar News
News February 6, 2026
మెదక్: రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

అంత్యక్రియలకు వచ్చి తిరిగి వెళ్తుండగా జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు దుర్మరణం చెందాడు. మేడ్చల్ జిల్లా కొనాయిపల్లికి చెందిన గుంటి నవీన్ కూచారంలో అంత్యక్రియలకు హాజరై బైక్పై వెళ్తున్నాడు. కాళ్లకల్ మైకో కంపెనీ వద్ద జాతీయ రహదారిపై గుర్తుతెలియని వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో నవీన్ అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
News February 6, 2026
హత్య కేసులో నిందితుడికి జీవిత ఖైదు: ఎస్పీ

మద్యం మత్తులో జరిగిన గొడవలో వ్యక్తిని హత్య చేసిన నిందితుడికి జిల్లా కోర్టు జీవిత ఖైదు విధిస్తూ తీర్పునిచ్చింది. గడిపేద్దపూర్కు చెందిన మహేష్.. యాదయ్యపై కర్రతో దాడి చేసి చంపాడు. దీనిపై అలాదుర్గం పోలీసులు దర్యాప్తు చేసి సాక్ష్యాలను ప్రవేశపెట్టగా, న్యాయమూర్తి శిక్షతో పాటు రూ.10,000 జరిమానా విధించారని ఎస్పీ శ్రీనివాసరావు తెలిపారు. కేసును సమర్థంగా దర్యాప్తు చేసిన సిబ్బందిని ఎస్పీ అభినందించారు.
News February 5, 2026
మున్సిపల్ ఎన్నికలు.. 2వ విడత రాండమైజేషన్

మున్సిపల్ ఎన్నికల నిర్వహణలో భాగంగా పోలింగ్, కౌంటింగ్ సిబ్బంది 2వ విడత రాండమైజేషన్ ప్రక్రియను కలెక్టర్ రాహుల్ రాజ్ నిర్వహించారు. కలెక్టర్ క్యాంప్ కార్యాలయంలో ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారం ఈ ప్రక్రియ చేపట్టారు. మెదక్, రామాయంపేట, తూప్రాన్, నర్సాపూర్ మున్సిపాలిటీల్లో ఎన్నికల విధుల కోసం సిబ్బందిని ఎంపిక చేశారు. పారదర్శకంగా ఎన్నికలు నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు.


