News September 2, 2025
లండన్లో యాక్సిడెంట్.. HYD వాసులు మృతి

లండన్లో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో HYDకు చెందిన ఇద్దరు యువకులు ప్రాణాలు కోల్పోయారు. 2 కార్లు ఎదురెదురుగా ఢీకొనగా ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. మృతులను నాదరుల్ చెందిన తర్రె చైతన్య (22), ఉప్పల్కు చెందిన రిషితేజ (21)గా పోలీసులు గుర్తించారు. గణేశ్ నిమజ్జనం చేసి వస్తుండగా ప్రమాదం జరిగిందని తెలిపారు. వారిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించినట్టు అధికారులు తెలిపారు.
Similar News
News February 3, 2026
200 కేంద్రాల్లో ఇంటర్ పరీక్షలు: రంగారెడ్డి కలెక్టర్

ఇంటర్మీడియట్ పరీక్షలను జిల్లా వ్యాప్తంగా 200 కేంద్రాల్లో నిర్వహిస్తున్నామని రంగారెడ్డి కలెక్టర్ నారాయణరెడ్డి తెలిపారు. ఫస్టియర్ విద్యార్థులు 84,301 మంది, సెకండ్ ఇయర్ విద్యార్థులు 70,171 మంది పరీక్షలకు హాజరవుతారన్నారన్నారు. విద్యార్థులు ఎక్కడా ఇబ్బందులు పడకుండా పరీక్షా కేంద్రాల్లో అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నామన్నారు. సమన్వయంతో పకడ్బందీగా పరీక్షలు నిర్వహించాలని అధికారులను ఆదేశించారు.
News February 3, 2026
ట్రెసా క్యాలెండర్, డైరీని ఆవిష్కరించిన కలెక్టర్

తెలంగాణ రెవెన్యూ ఎంప్లాయ్స్ సర్వీసెస్ అసోసియేషన్ (ట్రెసా) 2026 నూతన క్యాలెండర్, డైరీని రంగారెడ్డి జిల్లా కలెక్టర్ సోమవారం ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ చంద్రారెడ్డి, డీఆర్వో సంగీతతోపాటు ట్రెసా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గౌతమ్ కుమార్, జిల్లా అధ్యక్షుడు జనార్దన్ఋరావు పాల్గొన్నారు. రెవెన్యూ సిబ్బంది ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని కలెక్టర్ సూచించారు.
News February 2, 2026
రంగారెడ్డి: ఇంటర్ పరీక్షలకు ఏర్పాట్లు చేయాలి: కలెక్టర్

ఈనెల 25 నుంచి ప్రారంభం కానున్న ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలకు అన్ని ఏర్పాట్లు సిద్ధం చేయాలని జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ విధించాలని సూచించారు. విద్యార్థులకు ఇబ్బందులు కలగకుండా సౌకర్యాలు కల్పించాలని, పరీక్షల నిర్వహణలో అత్యంత ప్రాధాన్యత ఇస్తూ పారదర్శకంగా పనులు పూర్తి చేయాలన్నారు.


