News January 25, 2026

​లడ్డా – జిమిడిపేట మధ్య మూడో రైల్వే లైన్ ప్రారంభం

image

వాల్తేరు డివిజన్‌లోని లడ్డా-జిమిడిపేట స్టేషన్ల మధ్య నూతనంగా నిర్మించిన 7.181 కి.మీ.ల మూడో రైల్వే లైన్‌ను రైల్వే భద్రతా కమిషనర్ (CRS) బ్రిజేశ్ కుమార్ మిశ్రా శనివారం తనిఖీ చేశారు. తిత్లాగఢ్ – విజయనగరం ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన ఈ మార్గంలో స్పీడ్ ట్రయల్స్ విజయవంతమయ్యాయి. భద్రతా ప్రమాణాల పరిశీలన అనంతరం రైళ్ల రాకపోకలకు అనుమతి లభించింది. ఈ కార్యక్రమంలో DRM లలిత్ బోహ్రా, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Similar News

News January 25, 2026

విశాఖ: గ‌ణతంత్ర‌ దినోత్స‌వ వేడుక‌ల‌కు ఏర్పాట్లు పూర్తి

image

పోలీస్ ప‌రేడ్ మైదానంలో సోమ‌వారం నిర్వహించ‌నున్న 77వ గ‌ణతంత్ర‌ దినోత్స‌వ వేడుకుల‌కు ఏర్పాట్లు పూర్త‌య్యాయి. జెండా వంద‌నం జ‌రిగే మైదానంలో ఆదివారం పైల‌ట్ వాహ‌నానికి ట్ర‌యిల్ ర‌న్ నిర్వ‌హించి సిద్ధం చేశారు. ప్ర‌భుత్వం అమ‌లు చేస్తున్న ప‌థ‌కాల వివ‌రాల‌ను తెలియజేస్తూ స్టాళ్లను, శ‌క‌టాల‌ను సిద్ధం చేశారు. వివిధ సంక్షేమ ప‌థ‌కాల కింద 13,113 మందికి రూ.809.15 కోట్ల న‌గ‌దు ప్రోత్సాహ‌కాలను అందజేయనున్నారు.

News January 25, 2026

విశాఖ ఉత్సవ్‌లో నేడు కామాక్షి లైవ్ వయోలిన్ షో

image

సాగరతీరానా జనవరి 24 నుంచి ఫిబ్రవరి 1 వరకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పర్యాటక శాఖ ఆధ్వర్యంలో విశాఖ ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా ఆదివారం సాయంత్రం ఆర్కేబీచ్ రోడ్డులో ప్రముఖ సంగీత వయోలిన్ విద్వాంసురాలు కామాక్షి లైవ్ వయోలిన్ షో నిర్వహించనున్నారు. కామాక్షి ఇండియన్ ఐడల్, పలు మెగా ఈవెంట్స్‌లో ప్రదర్శనలు ఇచ్చారు.

News January 25, 2026

విశాఖ సీపీ కార్యాలయంలో సోమవారం PGRS రద్దు

image

విశాఖ సీపీ కార్యాలయంలో ప్రతి సోమవారం నిర్వహించే PGRS జనవరి 26న సోమవారం గణతంత్ర దినోత్సవ సందర్భంగా రద్దు చేసినట్టు సీపీ శంఖబ్రత బాగ్చి శనివారం తెలిపారు. ఫిర్యాదుదారులు ఈ విషయాన్ని గమనించాలన్నారు.
ప్రజలు సమస్యలు ఉంటే 112కు కాల్ చేయవచ్చని పేర్కొన్నారు. వచ్చే సోమవారం అనగా ఫిబ్రవరి 2వ తేదీ PGRS యధావిధిగా నిర్వహించనున్నారు.