News March 1, 2025
శ్రీశైలంలో నకిలీ నోట్ల కలకలం

శ్రీశైలంలో శివరాత్రి బ్రహ్మోత్సవాల్లో నకిలీ నోట్లు చలామణి కావడం కలకలం రేపింది. మహాశివరాత్రి సందర్భంగా శ్రీశైలానికి వివిధ రాష్ట్రాలకు చెందిన భక్తుల లక్షలాదిగా తరలివచ్చారు. ఈ క్రమంలో శ్రీశైలంలో వ్యాపారాలు ముమ్మరంగా సాగాయి. దీన్ని అదనుగా భావించిన కొందరు నకిలీ నోట్లతో పలు వస్తువులు కొనుగోలు చేశారు. తాజాగా రూ.200 నకిలీ నోట్లను గుర్తించినట్లు ఐస్క్రీం వ్యాపారులు తెలిపారు.
Similar News
News March 1, 2025
BREAKING: జైలులో పోసానికి అస్వస్థత

AP: అన్నమయ్య జిల్లా రాజంపేట సబ్ జైలులో ఉన్న పోసాని కృష్ణమురళి అస్వస్థతకు గురయ్యారు. దీంతో అధికారులు అతడిని జైలు నుంచి రాజంపేట ప్రభుత్వాస్పత్రికి తరలించారు. కాగా, ఆయనకు కోర్టు నిన్న 14 రోజుల రిమాండ్ విధించిన విషయం తెలిసిందే.
News March 1, 2025
ఈనెల 4న సంగారెడ్డిలో సృజన టెక్ ఫెస్ట్

సంగారెడ్డిలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో ఈ నెల 4న జిల్లా స్థాయి సృజన టెక్ ఫెస్ట్ నిర్వహించబడుతుందని కళాశాల ప్రిన్సిపల్ పి. జానకి దేవి శనివారం తెలిపారు. ఉమ్మడి మెదక్ జిల్లాలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలు ఈ టెక్ ఫెస్టులో పాల్గొంటాయని ప్రిన్సిపల్ తెలిపారు.
News March 1, 2025
విరుష్కను ఫాలో అయిన ఆలియా.. ఫొటోలు డిలీట్!

తన కుమార్తె రాహా ముఖాన్ని సోషల్ మీడియాలో చూపించకూడదని నటి ఆలియాభట్ నిర్ణయించుకున్నారు. అందుకే ఇన్స్టాగ్రామ్ సహా అన్ని హ్యాండిల్స్ నుంచి ఆమె ఫొటోలను డిలీట్ చేశారు. జామ్నగర్, పారిస్లో తీసుకున్న వాటినీ ఉంచలేదు. రాహా ముఖం కనిపించని ఒకే ఒక్క చిత్రాన్ని మాత్రం అలాగే ఉంచారు. ఆమె తీసుకున్నది సరైన నిర్ణయమేనని నెటిజన్లు అంటున్నారు. విరుష్క జోడీ తమ పిల్లలను ఎప్పట్నుంచో SMకు దూరంగా ఉంచడం తెలిసిందే.