News January 8, 2026
సత్తుపల్లి జిల్లాపై మళ్ళీ చర్చ.. నెరవేరేనా ప్రియాంక గాంధీ హామీ?

సత్తుపల్లి జిల్లా హామీపై కాంగ్రెస్ సర్కార్ పునరాలోచన చేస్తోందా? మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి చేసిన ‘నచ్చిన వారికి జిల్లాలు’ అన్న వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్గా మారాయి. నాడు ప్రియాంక గాంధీ ఇచ్చిన హామీని అమలు చేసే దిశగా అడుగులు పడతాయా? లేక రాజకీయ ప్రకటనలకే పరిమితమవుతాయా? అన్న సందేహం వ్యక్తమవుతోంది. మంత్రి వ్యాఖ్యల నేపథ్యంలో సత్తుపల్లి ఆశలు మళ్లీ చిగురించాయి.
Similar News
News February 5, 2026
ఖమ్మం జిల్లాలో పెరుగుతున్న క్యాన్సర్ కేసులు

ఖమ్మం (D)లో క్యాన్సర్ వ్యాధి చాపకింద నీరులా విస్తరిస్తోంది. జిల్లాలో ప్రస్తుతం 1,883 యాక్టివ్ కేసులు ఉండగా, బాధితుల్లో మహిళలే 1,418 మంది ఉన్నారు. ముఖ్యంగా రొమ్ము, సర్వైకల్ క్యాన్సర్ కేసులు అధికంగా నమోదవుతున్నాయి. జిల్లాలోని 31 PHC, 7CHCలతో పాటు ప్రభుత్వాసుపత్రిలో రోగులను గుర్తించి చికిత్స అందిస్తున్నారు. ఆహార అలవాట్లు, జీవనశైలిలో మార్పుల ద్వారా ఈ మహమ్మారిని నివారించవచ్చని వైద్యులు సూచిస్తున్నారు.
News February 5, 2026
నిధుల బకాయిల ఉచ్చులో ఖమ్మం పెద్దాసుపత్రి

ఖమ్మం పెద్దాసుపత్రికి ఏడాదిన్నరగా ఆరోగ్యశ్రీ నిధులు రాకపోవడంతో వైద్య సేవలకు ఆటంకం కలుగుతోంది. ఆర్థో విభాగానికి రావాల్సిన రూ.60 లక్షల బకాయిల వల్ల మోకాళ్ల ఆపరేషన్లు నిలిచిపోయాయి. క్యాత్ ల్యాబ్ పరికరాల కొనుగోలుకు నిధుల్లేక ఇబ్బందులు పడుతున్నారు. నిధుల కొరతతో అభివృద్ధి పనులు కుంటుపడటమే కాకుండా, రోగులకు సరైన చికిత్స అందడం లేదని, ప్రభుత్వం స్పందించి నిధులు విడుదల చేయాలని జిల్లావాసులు కోరుతున్నారు.
News February 5, 2026
ఖమ్మం RTA ఆఫీసులో నకిలీ ఆధార్ కార్డుల మాఫియా

KMM జిల్లా RTA కార్యాలయం సమీపంలోని ఏజెంట్ షాపుల కేంద్రంగా నకిలీ ఆధార్ కార్డుల దందా సాగుతోంది. కొంతమంది కార్యాలయ సిబ్బంది సహకారంతో దళారులు ఫోర్జరీ పత్రాలను సృష్టించి, ఫైనాన్స్ కట్టని వాహనాలకు కొత్త రిజిస్ట్రేషన్లు చేస్తున్నారు. ఇలా అక్రమ మార్గంలో భారీగా సొమ్ము వసూలు చేస్తున్నారని సమాచారం. కీలకమైన ఆధార్ కార్డునే నకిలీగా మారుస్తున్న ఈ మాఫియాపై చర్యలు తీసుకోవాలని జిల్లా ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.


