News February 8, 2025

సిద్దిపేట: ఘోర రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి

image

సిద్దిపేట జిల్లా చేగుంట, గజ్వేల్ రహదారి పై నర్సపల్లి చౌరస్తా వద్ద శనివారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. స్థానికుల వివరాలు.. మృతులు దౌల్తాబాద్ మండల పరిధిలోని తిరుమలాపూర్ గ్రామానికి చెందిన ఒకే కుటుంబానికి చెందినవారిగా గుర్తించారు.‌ రోడ్డు దాటుతున్న బైక్‌ను లారీ ఢీ కొట్టగా అక్కడికక్కడే మృతి చెందారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Similar News

News February 8, 2025

భారత జట్టుకు గుడ్‌న్యూస్

image

ఇంగ్లండ్‌తో జరిగిన తొలి వన్డేకు మోకాలి నొప్పి కారణంగా దూరమైన భారత జట్టు స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ రెండో వన్డేలో ఆడనున్నారు. కోహ్లీ ఫిట్‌గానే ఉన్నాడని, రెండో వన్డేకు అతడు సిద్ధమని భారత జట్టు బ్యాటింగ్ కోచ్ వెల్లడించారు. దీంతో కోహ్లీ కోసం జైస్వాల్‌ను తప్పిస్తారా? లేక శ్రేయస్ అయ్యర్‌ను పక్కనబెడతారా? అనేది తెలియాల్సి ఉంది. రేపు కటక్ వేదికగా మ.1.30 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది.

News February 8, 2025

తైక్వాండో నేషనల్‌లో మెరిసిన భద్రాద్రి జిల్లా అమ్మాయి

image

ఝార్ఖండ్‌‌లో నిర్వహించిన నేషనల్ తైక్వాండో అండర్ 73 కేజీల విభాగంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అల్లపల్లి మండల కేంద్రానికి చెందిన గిరిజన యువతి పాయం హర్షప్రద తెలంగాణ రాష్ట్రానికి సిల్వర్ మెడల్ సాధించింది. ఏజెన్సీ ప్రాంతానికి చెందిన గిరిజన యువతి విజయ సాధించడంపై ఆళ్లపల్లి మండలానికి చెందిన పలువురు అభినందనలు తెలిపారు.

News February 8, 2025

నల్గొండ పోలీసులకు తలనొప్పిగా పిల్లి కేసు!

image

పిల్లి పెట్టిన లొల్లి NLG పోలీసులకు తలనొప్పిగా మారింది. స్థానిక రహమత్ నగర్‌కు చెందిన పుష్పలత పెంచుకుంటున్న పిల్లి ఏడాదిక్రితం తప్పిపోగా PSలో ఫిర్యాదు చేశారు. పక్కింట్లో అదే పోలికలతో ఉన్న పిల్లి కనిపించగా ఆపిల్లి తమదేనని, పక్కింటి వారు ఎత్తుకెళ్లారంటూ Jan15న 2టౌన్‌ PSలో పుష్పలత కేసు పెట్టింది. పోలీసులు పిల్లి వెంట్రుకలు సేకరించి ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపిచారు. పిల్లి ఎవరికి చెందుతుందో తేలాల్సి ఉంది.

error: Content is protected !!