News February 8, 2025
భారత జట్టుకు గుడ్న్యూస్

ఇంగ్లండ్తో జరిగిన తొలి వన్డేకు మోకాలి నొప్పి కారణంగా దూరమైన భారత జట్టు స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ రెండో వన్డేలో ఆడనున్నారు. కోహ్లీ ఫిట్గానే ఉన్నాడని, రెండో వన్డేకు అతడు సిద్ధమని భారత జట్టు బ్యాటింగ్ కోచ్ వెల్లడించారు. దీంతో కోహ్లీ కోసం జైస్వాల్ను తప్పిస్తారా? లేక శ్రేయస్ అయ్యర్ను పక్కనబెడతారా? అనేది తెలియాల్సి ఉంది. రేపు కటక్ వేదికగా మ.1.30 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది.
Similar News
News April 11, 2026
సింగర్ మంగ్లీపై కేసు నమోదు

ప్రముఖ సింగర్ మంగ్లీపై HYD పంజాగుట్ట PSలో కేసు నమోదైంది. మంగ్లీ, ఆమె సోదరుడు, మరికొంతమందితో కలిసి పెట్టుబడులు, అధిక లాభాల పేరుతో 100 మంది నుంచి రూ.10 కోట్ల మేర వసూలు చేసినట్లు బాధితులు ఆరోపించారు. న్యాయం కోరుతూ వారు లాయర్ సుబ్బారావును ఆశ్రయించారు. కాగా ఆ న్యాయవాదిని మంగ్లీ బృందం బెదిరించడంతో అతను PSలో ఫిర్యాదు చేశారు. దీంతో మంగ్లీ సహా సోదరుడు శివ, డైరెక్టర్ వేణు ఊడుగుల తదితరులపై కేసు నమోదైంది.
News April 11, 2026
ఇరాన్కు కొత్త తలనొప్పి.. మైన్స్ దొరకట్లేదు!

‘హార్ముజ్’ను ఇరాన్ పూర్తిస్థాయిలో తెరవకపోవడం వెనుక ఆసక్తికర విషయాలను న్యూయార్క్ టైమ్స్ ఓ కథనంలో వెల్లడించింది. యుద్ధం ప్రారంభ దశలో IRGC మెంబర్లు స్మాల్ బోట్ల సాయంతో హార్ముజ్లో ఇష్టారీతిన <<19350581>>మైన్స్<<>> పెట్టారని తెలిపింది. ఇప్పుడు ఆ లొకేషన్లను ట్రాక్ చేయడం కష్టంగా మారిందని, మైన్లను తొలగించే సామర్థ్యం ఇరాన్ వద్ద లేదని పేర్కొంది. మైన్లను పెట్టడం కంటే తొలగించడం కష్టం, ఖర్చుతో కూడుకున్న పని అని వివరించింది.
News April 11, 2026
టీ కొట్టు నుంచి మాల్స్ వరకు.. ‘UPI’కి పదేళ్లు!

ఇండియన్ డిజిటల్ పేమెంట్స్కు చిరునామాగా మారిన UPIకి నేటితో పదేళ్లు. 2016లో NPCI ప్రారంభించిన ఈ వ్యవస్థ నేడు దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముకగా నిలిచింది. ప్రస్తుతం 50 కోట్ల మందికి పైగా యూజర్లు, 504 బ్యాంకులు, 6.5 కోట్ల మంది వ్యాపారులతో ప్రపంచంలోనే అతిపెద్ద రిటైల్ పేమెంట్ వ్యవస్థగా అవతరించింది. టీ కొట్టు నుంచి మాల్స్ వరకు ప్రతిచోటా ఫోన్ ద్వారా సులభంగా డబ్బులు పంపేలా UPI మన జీవితాలను మార్చేసింది.


