News February 14, 2026

సిరిసిల్ల: ఆ నలుగురిలో ఎవరికి పీఠం దక్కెదెవరికి..?

image

సిరిసిల్ల పుర పీఠంపై బీఆర్ఎస్‌లో పోటీ పెరిగింది. గెలిచిన అభ్యర్థుల్లో చైర్మన్ కోసం ప్రధానంగా నలుగురు పోటీలో ఉన్నట్లు సమాచారం. సిట్టింగ్ చైర్ పర్సన్, 3వ వార్డు కౌన్సిలర్ జిందం కళ, 30వ వార్డు కౌన్సిలర్ మంచే రేణుక, 5వ వార్డు కౌన్సిలర్ దార్నం అరుణ, 36వ వార్డు కౌన్సిలర్ కల్లూరి రేణుక ఆశావాహుల్లో జాబితాలో ఉన్నారు. KTR ఆశీస్సులు ఎవరికి ఉండనున్నాయో, పీఠం దక్కేదేవరికో అని పట్టణంలో జోరుగా చర్చ సాగుతుంది.

Similar News

News April 15, 2026

బీట్‌రూట్‌తో హెల్తీ హెయిర్

image

అందంగా, ఆరోగ్యంగా ఉండే హెయిర్ కావాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. అయితే ప్రస్తుతం వివిధ కారణాల వల్ల చాలామంది జుట్టు సమస్యలతో బాధ పడుతున్నారు. దీనికి బీట్‌రూట్ పరిష్కారం చూపుతుందంటున్నారు నిపుణులు. దీన్ని తరచూ ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల తల్లోని జిడ్డు, చుండ్రు తగ్గుతాయి. దీంట్లోని ఐరన్, యాంటీ ఆక్సిడెంట్లు మాడు రక్తప్రసరణను పెంచి కుదుళ్లను దృఢంగా చేసి జుట్టు రాలడాన్ని తగ్గిస్తుందంటున్నారు.

News April 15, 2026

యుద్ధం వేళ డిజిటల్ బంగారంపై పెరిగిన నమ్మకం!

image

ప్రపంచవ్యాప్తంగా రాజకీయ, ఆర్థిక అనిశ్చితులు నెలకొన్న వేళ ఇన్వెస్టర్లు బంగారం వైపు మొగ్గుచూపుతున్నారు. స్టాక్ మార్కెట్ల ఊగిసలాటల మధ్య రిస్క్ లేని పెట్టుబడి కోసం గోల్డ్ ETFలను ఆశ్రయిస్తున్నారు. ఈ ఏడాది తొలి 3 నెలల్లో ఏకంగా ₹31,561 కోట్లు ఈ ఫండ్లలోకి చేరాయి. గత ఏడాదితో పోలిస్తే ఇది 6రెట్లు పెరగడం గమనిస్తే.. ఇన్వెస్టర్లు భౌతిక బంగారం కంటే డిజిటల్ పసిడి వైపే అట్రాక్ట్ అవుతున్నట్లు స్పష్టమవుతోంది.

News April 15, 2026

అంబటికి పోలీసుల నోటీసులు

image

కడప జిల్లా వేంపల్లి పోలీసులు మాజీ మంత్రి అంబటి రాంబాబుకు నోటీసులు జారీ చేశారు. 2026 ఫిబ్రవరి 1న సింగారెడ్డి రామ మునిరెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదైంది. నోటీసులు అందిన వారం రోజుల్లోగా వేంపల్లి స్టేషనుకు హాజరై దర్యాప్తుకు సహకరించాలని అధికారులు ఆదేశించారు.