News April 4, 2026
సీఎం పర్యటన ఏర్పాట్లు పకడ్బందీగా ఉండాలి: కలెక్టర్

CM ఈనెల 6న జిల్లాలో పర్యటించనున్న నేపథ్యంలో ఏర్పాట్లను పకడ్బందీగా పూర్తి చేయాలని కలెక్టర్ రాజర్షి షా అధికారులను ఆదేశించారు. ఎక్కడా ఎలాంటి లోటుపాట్లు జరగకుండా ప్రోటోకాల్ నిబంధనలు తూచా తప్పకుండా పాటించాలని స్పష్టం చేశారు. ప్రారంభోత్సవాలు, శిలాఫలకాల ఆవిష్కరణల వద్ద అత్యంత అప్రమత్తంగా ఉండాలని సూచించారు. కేటాయించిన విభాగాల వద్దే ప్రజా ప్రతినిధులు, అధికారులు అందుబాటులో ఉండాలని ఆదేశాలు జారీ చేశారు.
Similar News
News April 20, 2026
ADB: ఓపెన్ ఇంటర్, టెన్త్ పరీక్షలు.. 177 మంది గైర్హాజరు

TOSS ఓపెన్ ఇంటర్ టెన్త్ పరీక్షలు సోమవారం ప్రశాంత వాతావరణంలో ప్రారంభమయ్యాయి. జిల్లాలో పదో తరగతికి 4 ఇంటర్కు 3 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఉదయం 9 గంటల నుంచి 12 గంటల వరకు పరీక్ష ప్రశాంతంగా ముగిసింది. పది పరీక్షకు 548 విద్యార్థులకు గాను 410 మంది హాజరై 130 మందికి గైర్హాజరయ్యారు. అలాగే ఇంటర్కు 461 మంది విద్యార్థులకు గాను 414 మంది విద్యార్థులు హాజరై 47 మంది గైర్హాజరయ్యారని అధికారులు తెలిపారు.
News April 20, 2026
ADB: నేటి నుంచి వారోత్సవాలు.. కలెక్టర్ ALERT

ఆదిలాబాద్ జిల్లాలో సంక్షేమ వారోత్సవాలను ఈనెల 20 నుంచి అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ రాజర్షి షా అధికారులను ఆదేశించారు. ఈ మేరకు ఆదివారం జిల్లా స్థాయి అధికారులతో నిర్వహించిన టెలికాన్ఫరెన్స్లో మాట్లాడారు. ఏప్రిల్ 20 నుంచి 26 వరకు వారం రోజుల పాటు ఈ సంక్షేమ వారోత్సవాలు జరుగుతాయన్నారు. ప్రతి రోజూ ప్రత్యేక కార్యక్రమాలను ప్రణాళికబద్దంగా నిర్వహిస్తూ, నివేదికలను నమోదు చేయాలన్నారు.
News April 19, 2026
ADB: 4 క్వింటాళ్ల కోళ్ల చోరీ.. ముగ్గురి అరెస్టు

ఆదిలాబాద్లోని దస్నాపూర్లో కోళ్ల దొంగతనం కేసును మావల పోలీసులు చేధించారు. పోలీసులు తెలిపిన వివరాలు.. రాత్రి సమయంలో కొందరు దుండగులు షాప్ వెనుక భాగంలో టిన్ షీట్లు కట్ చేసి లోపలికి ప్రవేశించి సుమారు 4 క్వింటాళ్ల కోళ్లను ఎత్తుకెళ్లారు. సుగుణ చికెన్ సెంటర్ యజమాని సంజీవ్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి నిందితులు అమన్, ఫిరోజ్ ఖాన్, ముజాహిద్ అలీని అరెస్టు చేశారు. ఒకరు పరారీలో ఉన్నారు.


