News May 20, 2024

ఈక్విటీ మార్కెట్లో రూ.1.3 లక్షల కోట్ల పెట్టుబడులు

image

ఈక్విటీ మార్కెట్లలోకి పెట్టుబడుల వరద కొనసాగుతోంది. ఈ ఏడాది మే 16 నాటికి మ్యూచువల్ ఫండ్లు ఈక్విటీల్లోకి రూ.1.3 లక్షల కోట్లు ఇన్వెస్ట్‌మెంట్ చేశాయి. వృద్ధి అవకాశాలను దృష్టిలో పెట్టుకునే మదుపర్లు ఎక్కువ ఆసక్తి కనబరుస్తున్నారు. ఇదే సమయంలో విదేశీ ఇన్వెస్టర్లు ఈక్విటీల నుంచి రూ.25వేల కోట్లకు పైగా వెనక్కి తీసుకున్నారు. మరోవైపు NSE నమోదిత కంపెనీల్లో MFల వాటా జీవితకాల గరిష్ఠం 8.92 శాతానికి చేరింది.

Similar News

News November 22, 2025

సున్నాకే 2 వికెట్లు.. వైభవ్‌ సూర్యవంశీని ఎందుకు ఆడించలేదు?

image

ACC రైజింగ్ స్టార్స్ టోర్నీ సెమీస్‌లో భారత్-A ఘోరంగా ఓడిపోవడం తెలిసిందే. <<18351593>>సూపర్ ఓవర్‌‌లో<<>> ఇండియా సున్నాకే 2 వికెట్లు కోల్పోవడంతో బంగ్లా ఈజీగా గెలిచేసింది. ఈ నేపథ్యంలో ఫామ్‌లో ఉన్న వైభవ్ సూర్యవంశీని సూపర్ ఓవర్‌లో ఎందుకు బ్యాటింగ్‌కు పంపలేదని నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. ఈ బ్లండర్ మిస్టేక్ వల్ల మ్యాచ్ ఓడిపోయామని మండిపడుతున్నారు. వైభవ్ ఆడుంటే ఇంకోలా ఉండేదని అంటున్నారు. మీరేమంటారు?

News November 22, 2025

అధికారి కొడుకు, కూలీ కొడుకు పోటీ పడేలా చేయలేం: సీజేఐ

image

SC, ST రిజర్వేషన్ల ఉప వర్గీకరణపై తన తీర్పుకు కట్టుబడి ఉన్నానని CJI జస్టిస్ గవాయ్ స్పష్టం చేశారు. సీఎస్ కొడుకును వ్యవసాయ కూలీ కొడుకుతో పోటీ పడేలా చేయలేమని అన్నారు. ‘ఆర్టికల్ 14 సమానత్వాన్ని నమ్ముతుంది. అంటే అందరినీ సమానంగా చూడాలని కాదు. వెనుకబడిన వారిని ప్రత్యేకంగా ట్రీట్ చేయాలి. సమానత్వ భావనంటే ఇదే’ అని చెప్పారు. తన చివరి వర్కింగ్ డే సందర్భంగా వీడ్కోలు కార్యక్రమంలో ఆయన మాట్లాడారు.

News November 22, 2025

peace deal: ఉక్రెయిన్‌ను బెదిరించి ఒప్పిస్తున్న అమెరికా!

image

రష్యా-ఉక్రెయిన్ యుద్ధాన్ని ఆపేందుకు అమెరికా తీవ్రంగా ప్రయత్నిస్తోంది. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీకి 28 పాయింట్లతో కూడిన <<18346240>>పీస్ ప్లాన్‌<<>>ను అందజేసింది. అయితే దీన్ని అంగీకరించాలని ఉక్రెయిన్‌పై ఒత్తిడి చేస్తున్నట్లు తెలుస్తోంది. లేదంటే నిఘా సమాచారం, ఆయుధాల సరఫరాలను తగ్గిస్తామని బెదిరించినట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. వచ్చే గురువారం లోగా ఒప్పందంపై సంతకం చేయాలని చెప్పినట్లు తెలిపాయి.