News May 20, 2024
ఈక్విటీ మార్కెట్లో రూ.1.3 లక్షల కోట్ల పెట్టుబడులు

ఈక్విటీ మార్కెట్లలోకి పెట్టుబడుల వరద కొనసాగుతోంది. ఈ ఏడాది మే 16 నాటికి మ్యూచువల్ ఫండ్లు ఈక్విటీల్లోకి రూ.1.3 లక్షల కోట్లు ఇన్వెస్ట్మెంట్ చేశాయి. వృద్ధి అవకాశాలను దృష్టిలో పెట్టుకునే మదుపర్లు ఎక్కువ ఆసక్తి కనబరుస్తున్నారు. ఇదే సమయంలో విదేశీ ఇన్వెస్టర్లు ఈక్విటీల నుంచి రూ.25వేల కోట్లకు పైగా వెనక్కి తీసుకున్నారు. మరోవైపు NSE నమోదిత కంపెనీల్లో MFల వాటా జీవితకాల గరిష్ఠం 8.92 శాతానికి చేరింది.
Similar News
News November 6, 2025
బడికిరాని విద్యార్థులను తిరిగి తీసుకువచ్చే బాధ్యత CRPలదే: DSE

AP: బడికిరాని విద్యార్థుల ఇళ్లకు వెళ్లి వారు తిరిగి స్కూళ్లకు వచ్చేలా CRPలు చర్యలు తీసుకోవాలని పాఠశాల విద్యాశాఖ ఆదేశించింది. వెబ్ఎక్స్ మీటింగ్లో కమిషనర్ సమీక్షించారు. స్కూళ్లకు రాని వారికి హాజరు వేసినట్లు గుర్తిస్తే టీచర్లు, అధికారులపై చర్యలు తప్పవని హెచ్చరించారు. SSC పరీక్షల కోసం విద్యార్థులకు 100 రోజుల ప్రణాళికను రూపొందించామన్నారు. దీన్ని ప్రభుత్వ స్కూళ్లలో తప్పనిసరిగా అమలు చేయాలని చెప్పారు.
News November 6, 2025
ఆస్ట్రేలియాపై భారత్ విక్టరీ

నాలుగో టీ20లో ఆస్ట్రేలియాపై భారత్ 48 రన్స్ తేడాతో విజయం సాధించింది. 168 రన్స్ టార్గెట్తో బరిలోకి దిగిన ఆసీస్ 18.2 ఓవర్లలో 119 పరుగులకే కుప్పకూలింది. టీమ్ ఇండియా బౌలర్లలో సుందర్ 3, అక్షర్, దూబే చెరో 2, వరుణ్, అర్ష్దీప్, బుమ్రా తలో వికెట్ తీశారు. దీంతో భారత్ 5 టీ20 సిరీస్లో 2-1తో లీడ్లో నిలిచింది. చివరి టీ20 ఈనెల 8న జరగనుంది.
News November 6, 2025
బోన్ సూప్ తాగుతున్నారా?

చాలామందికి చికెన్, మటన్ బోన్ సూప్ అంటే ఇష్టం. ఇది రుచికరమే కాకుండా ఆరోగ్యానికీ ఎంతో మంచిదని యూరోపియన్ మెడికల్ జర్నల్ వెల్లడించింది. ‘ఇందులో యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్, అమైనో ఆమ్లాలు, గ్లుటామైన్, ఖనిజాలు ఉంటాయి. ఇవి జీర్ణశక్తి, గట్ హెల్త్, రోగనిరోధక శక్తికి దోహదం చేస్తాయి. చలికాలంలో వేధించే జలుబు, గొంతునొప్పి, దగ్గు, మలబద్ధకం, గ్యాస్ట్రిక్, అవయవాల్లో వాపు సమస్యలను నివారిస్తాయి’ అని పేర్కొంది.


