News April 24, 2024

అయోధ్యను 1.5కోట్ల మంది సందర్శించారు: ట్రస్ట్

image

జనవరి 22న ప్రాణప్రతిష్ఠ జరిగినప్పటి నుంచి అయోధ్య రామమందిరాన్ని 1.5కోట్ల సందర్శించారని రామ జన్మభూమి ట్రస్ట్ వెల్లడించింది. ప్రతి రోజు సుమారు లక్షమందికి పైగా భక్తులు బాలరాముడిని దర్శించుకున్నట్టు తెలిపింది. ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్యలో బాలరాముడి విగ్రహ ప్రాణప్రతిష్ఠను కేంద్ర ప్రభుత్వం అట్టహాసంగా నిర్వహించిన విషయం తెలిసిందే. ఆలయ ప్రారంభోత్సవానికి దేశ నలుమూలల నుంచి ప్రముఖులు హాజరయ్యారు.

Similar News

News April 3, 2026

రెండేళ్లుగా సింగరేణిలో తగ్గుతున్న బొగ్గు ఉత్పత్తి

image

TG: గత రెండేళ్లుగా సింగరేణి బొగ్గు ఉత్పత్తి తగ్గుతోంది. 2025-26లో 72 మెట్రిక్ టన్నులు లక్ష్యంగా పెట్టుకోగా ఉత్పత్తి 58MTకే పరిమితమైంది. అంతకముందు ఏడాదితో పోలిస్తే ఇది 16% తక్కువ. FY25లోనూ 72MT టార్గెట్ అయితే 69MTనే ఉత్పత్తి చేసింది. భారీ వర్షాలు, మార్కెట్‌లో లో గ్రేడ్ బొగ్గుకు డిమాండ్ తగ్గడం, సంస్థ బొగ్గు ధరలను పెంచడం, కొత్త గనుల మంజూరులో జాప్యం ఉత్పత్తి తగ్గడానికి కారణాలుగా తెలుస్తోంది.

News April 3, 2026

ఏప్రిల్ 3: చరిత్రలో ఈరోజు

image

★ 1914: భారత్ తొలి ఫీల్డ్ మార్షల్ శామ్ మానెక్ షా జననం
★ 1955: సింగర్ హరిహరన్ జననం
★ 1962: సినీనటి జయప్రద జననం
★ 1973: నృత్యదర్శకుడు, నటుడు ప్రభు దేవా జననం
★ 1680: మరాఠా సామ్రాజ్య వ్యవస్థాపకుడు ఛత్రపతి శివాజీ మహరాజ్ మరణం
★ 1943: ఇండియన్ ఆర్మీ మెడికల్ కార్ప్స్ స్థాపన

News April 3, 2026

రెండు భాగాలుగా బాలయ్య-వివేక్ ఆత్రేయ సినిమా?

image

యంగ్ డైరెక్టర్ వివేక్ ఆత్రేయతో గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ సినిమాపై ఓ ఆసక్తికర అప్డేట్ సినీవర్గాల్లో చక్కర్లు కొడుతోంది. పెద్ద కథ కావడంతో దీనిని రెండు భాగాలుగా తెరకెక్కించాలని మేకర్స్ డిసైడ్ అయ్యారట. దర్శకుడి నరేషన్ నచ్చడంతో బాలయ్య సైతం ఇందుకు ఓకే చెప్పినట్లు సమాచారం. ఈ ఏడాదిలోనే సెట్స్‌పైకి వెళ్లనున్న ఈ మూవీకి ‘కురుక్షేత్రం’ అనే టైటిల్ పరిశీలిస్తున్నట్లు టాక్.