News April 24, 2024
అయోధ్యను 1.5కోట్ల మంది సందర్శించారు: ట్రస్ట్

జనవరి 22న ప్రాణప్రతిష్ఠ జరిగినప్పటి నుంచి అయోధ్య రామమందిరాన్ని 1.5కోట్ల సందర్శించారని రామ జన్మభూమి ట్రస్ట్ వెల్లడించింది. ప్రతి రోజు సుమారు లక్షమందికి పైగా భక్తులు బాలరాముడిని దర్శించుకున్నట్టు తెలిపింది. ఉత్తరప్రదేశ్లోని అయోధ్యలో బాలరాముడి విగ్రహ ప్రాణప్రతిష్ఠను కేంద్ర ప్రభుత్వం అట్టహాసంగా నిర్వహించిన విషయం తెలిసిందే. ఆలయ ప్రారంభోత్సవానికి దేశ నలుమూలల నుంచి ప్రముఖులు హాజరయ్యారు.
Similar News
News November 14, 2025
శ్రీమహావిష్ణువు అనుగ్రహాన్ని పొందాలంటే?

తమేవ చార్చయన్నిత్యం భక్త్యా పురుషమవ్యయం|
ధ్యాయన్ స్తువన్నమస్యంశ్చ యజమానస్తమేవ చ||
శాశ్వతమైన పరమాత్మను నిరంతరం ఆరాధించాలని, ఆయననే ప్రధానంగా పూజించాలని ఈ శ్లోకార్థం. భగవంతుడ్ని ధ్యానిస్తూ, స్తుతిస్తూ, నమస్కరిస్తూ, ప్రతి కర్మనూ అంకితం చేయాలి. ప్రతి ఆలోచన ఆ పరమాత్మకే అర్పించాలి. తద్వారానే ఆయన అనుగ్రహం పొందగలం. అందుకే అనుక్షణం పరమాత్మ చింతనతో జీవించాలని పండితులు చెబుతారు.<<-se>>#VISHNUSAHASRANAMAM<<>>
News November 14, 2025
యూనివర్సిటీ ఆఫ్ HYDలో JRF పోస్టులు

యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ JRFపోస్టులకు దరఖాస్తులు కోరుతోంది. పోస్టును బట్టి సంబంధిత విభాగంలో ఎమ్మెస్సీ, ఎంటెక్ ఉత్తీర్ణతతో పాటు GATE/CSIR/UGC-NET అర్హత సాధించి ఉండాలి. లైఫ్సైన్స్లో JRFకు ఈ నెల 20 ఆఖరు తేదీ కాగా, అట్మాస్ఫియరిక్ సైన్సెస్/ఓషియన్,మెటియోరాలజీ, ఫిజికల్ ఓషనోగ్రఫీ, జియాలజీ విభాగంలో JRFకు ఈ నెల 27 ఆఖరు తేదీ.
News November 14, 2025
జూబ్లీహిల్స్లో నవీన్ యాదవ్ ఘన విజయం

TG: జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ జయకేతనం ఎగురవేశారు. BRS అభ్యర్థి మాగంటి సునీతపై భారీ మెజారిటీతో ఘన విజయం సాధించారు. గతంలో ఇక్కడి నుంచి రెండు సార్లు పోటీ చేసి ఓడిన నవీన్.. ఈసారి ఉపఎన్నికలో సత్తా చాటారు. దాదాపు 25వేల ఓట్ల మెజారిటీతో జూబ్లీహిల్స్ అడ్డాలో కాంగ్రెస్ జెండా పాతారు.


