News April 24, 2024

అయోధ్యను 1.5కోట్ల మంది సందర్శించారు: ట్రస్ట్

image

జనవరి 22న ప్రాణప్రతిష్ఠ జరిగినప్పటి నుంచి అయోధ్య రామమందిరాన్ని 1.5కోట్ల సందర్శించారని రామ జన్మభూమి ట్రస్ట్ వెల్లడించింది. ప్రతి రోజు సుమారు లక్షమందికి పైగా భక్తులు బాలరాముడిని దర్శించుకున్నట్టు తెలిపింది. ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్యలో బాలరాముడి విగ్రహ ప్రాణప్రతిష్ఠను కేంద్ర ప్రభుత్వం అట్టహాసంగా నిర్వహించిన విషయం తెలిసిందే. ఆలయ ప్రారంభోత్సవానికి దేశ నలుమూలల నుంచి ప్రముఖులు హాజరయ్యారు.

Similar News

News January 18, 2025

ఇంగ్లండ్‌తో వన్డే సిరీస్‌కూ అదే జట్టు.. కానీ

image

ఛాంపియన్స్ ట్రోఫీకి ప్రకటించిన 15 మంది సభ్యుల <<15185531>>జట్టే<<>> ఇంగ్లండ్‌తో జరగనున్న వన్డే సిరీస్‌లోనూ పాల్గొంటుందని కెప్టెన్ రోహిత్ శర్మ, చీఫ్ సెలక్టర్ అగార్కర్ తెలిపారు. కానీ బుమ్రా స్థానంలో హర్షిత్ రాణా వస్తారని వెల్లడించారు. అయితే తొలి రెండు వన్డేలకు బుమ్రాకు రెస్ట్ ఇచ్చినట్లు సమాచారం. ఆ తర్వాత జరిగే మూడో వన్డే నుంచి అతడు జట్టులోకి వచ్చి, CTలోనూ పాల్గొంటారని తెలుస్తోంది.

News January 18, 2025

అనుమానాలు పటాపంచలు.. CTలో బుమ్రా

image

బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో గాయపడిన బుమ్రా ఛాంపియన్స్ ట్రోఫీలో ఆడటం అనుమానమేనన్న వార్తలకు తెరపడింది. ఇవాళ అతని పేరును సెలక్టర్లు ప్రకటించారు. దీంతో స్టార్ బౌలర్ కోలుకున్నట్లు పరోక్షంగా చెప్పినట్లయింది. BGTలో భారత బౌలింగ్ దళాన్ని బుమ్రా ఒంటి చేత్తో ముందుకు నడిపించిన విషయం తెలిసిందే. ట్రోఫీ కోల్పోయినప్పటికీ మ్యాన్ ఆఫ్ ది సిరీస్ అవార్డును సొంతం చేసుకున్నారు.

News January 18, 2025

రాయలసీమను రతనాల సీమగా చేయడమే లక్ష్యం: సీఎం చంద్రబాబు

image

AP, కేంద్రంలో NDA ప్రభుత్వం ఉండటం వల్లే అమరావతి, పోలవరం పనులు ముందుకెళ్తున్నాయని CM చంద్రబాబు తెలిపారు. గత ఐదేళ్లూ ప్రజలకు మాట్లాడే స్వేచ్ఛ కూడా లేకుండా పోయిందన్నారు. ఇప్పుడిప్పుడే కష్టాలన్నీ తీరిపోతున్నాయని చెప్పారు. మైదుకూరులో మాట్లాడుతూ రాయలసీమను రతనాల సీమగా చేయడమే తన లక్ష్యమన్నారు. గోదావరి-పెన్నా, పోలవరం-బనకచర్ల అనుసంధానమైతే గేమ్‌ఛేంజర్‌ అవుతుందని పేర్కొన్నారు.