News April 4, 2024
10 గ్రాముల బంగారం రూ.70,470

తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధర ఆల్టైమ్ గరిష్ఠానికి చేరింది. 24 క్యారెట్ల 10గ్రాముల గోల్డ్ రేట్ రూ.600 పెరిగి రూ.70,470కి చేరింది. 22 క్యారెట్ల పసిడి 10 గ్రాములకు రూ.500 పెరిగి రూ.64,600గా నమోదైంది. పెళ్లిళ్ల సీజన్ కావడంతో బంగారం కొనాలంటే వినియోగదారులు బెంబేలెత్తుతున్నారు. అటు కేజీ వెండి ధర కూడా రూ.1300 పెరిగి రూ.85,300కు చేరింది.
Similar News
News October 30, 2025
భక్తిని పెంచే సాధనాలు ‘రుద్రాక్ష, విభూతి’

మానవుడు భగవంతునిపై భక్తిని పెంచుకోవడానికి వివిధ మార్గాలు ఉన్నాయి. రుద్రాక్ష ధారణ ద్వారా ఓ వ్యక్తి నాలుగో వంతు భక్తిని పొందుతాడు. విభూతి ధారణ వల్ల సగ భాగం భక్తి లభిస్తుంది. ఇక మంత్ర జపం చేస్తే మూడు వంతుల భక్తిని సాధించవచ్చు. ఈ పనులన్నింటితో పాటు దేవుడిని పూజిస్తే ఆ వ్యక్తి పూర్ణ భక్తిని పొందుతాడు. పూర్ణ భక్తి లభించిన తర్వాత, దాని అంతిమ ఫలం జన్మ రాహిత్యమే. అంటే మోక్షం పొందడమే అన్నమాట. <<-se>>#SIVOHAM<<>>
News October 30, 2025
నీలి రంగులోకి మారిపోయిన కుక్కలు.. కారణం అదేనా?

ఉక్రెయిన్లోని చెర్నోబిల్ అణు విద్యుత్ ప్లాంట్ సమీపంలో కొన్ని వీధి కుక్కలు నీలి రంగులో ఉండటం ఆశ్చర్యపరుస్తోంది. ఇవి 1986 నాటి అణు ప్రమాదం తర్వాత మిగిలిపోయిన పెంపుడు జంతువుల సంతతికి చెందిన శునకాలుగా శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. కాపర్ సల్ఫేట్ వంటి పారిశ్రామిక రసాయనాల వల్లే ఇలా మారిపోయి ఉండవచ్చని అనుమానిస్తున్నారు. దీని మూలాన్ని గుర్తించడానికి వాటి వెంట్రుకలు, రక్త నమూనాలను పరీక్షిస్తున్నారు.
News October 30, 2025
తుఫానుతో రూ.5,265 కోట్ల నష్టం: చంద్రబాబు

AP: ‘మొంథా’ తుఫాను వల్ల రాష్ట్రానికి రూ.5,265 కోట్ల నష్టం వాటిల్లిందని ప్రాథమిక అంచనా వేసినట్లు సీఎం చంద్రబాబు వెల్లడించారు. అత్యధికంగా ఆర్అండ్బీకి రూ.2,079 కోట్లు, ఆక్వా రంగానికి రూ.1,270 కోట్లు, వ్యవసాయ రంగానికి రూ.829 కోట్ల నష్టం వాటిల్లినట్లు పేర్కొన్నారు. అయితే ఏ ఒక్కరూ ప్రాణాలు కోల్పోలేదని వెల్లడించారు. ముందస్తు చర్యలతో నీటిపారుదల శాఖకు తక్కువ నష్టమే వాటిల్లిందని తెలిపారు.


