News December 16, 2024
పిఠాపురానికి 100 పడకల ఆసుపత్రి
AP: తన నియోజకవర్గం పిఠాపురానికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ 100 పడకల ఆసుపత్రిని మంజూరు చేయించారు. 30 బెడ్ల కమ్యూనిటీ హెల్త్ సెంటర్ను 100 బెడ్ల ఆస్పత్రికి అప్గ్రేడ్ చేస్తున్నట్లు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీనికోసం రూ.38కోట్లు వెచ్చించనుంది. ఇక్కడ అవసరమైన 66 పోస్టుల్ని త్వరలోనే సర్కారు భర్తీ చేస్తుందని, వారి జీతాలకు రూ.4.32 కోట్లు వెచ్చిస్తుందని జనసేన Xలో తెలిపింది.
Similar News
News January 19, 2025
అమెరికాలో టిక్టాక్ బంద్
అమెరికాలో టిక్టాక్ బంద్ అయింది. సుప్రీంకోర్టు ఆదేశాలతో సేవలను నిలిపివేస్తున్నట్లు యాజమాన్యం తెలిపింది. కాగా ఈ యాప్ అమెరికా యూజర్ల డేటాను దాని మాతృ సంస్థ అయిన ‘బైట్ డాన్స్’ ద్వారా చైనా ప్రభుత్వానికి చేరవేస్తోందని అగ్రరాజ్యం ఆరోపణ. చైనా కాకుండా అమెరికా కేంద్రంగా పని చేసే ఏదైనా అమెరికన్ కంపెనీకి అమ్మేస్తే అభ్యంతరం లేదని సుప్రీంకోర్టు తెలిపింది. ఇందుకు ‘బైట్ డాన్స్’ అంగీకరించలేదు.
News January 19, 2025
ఈపీఎఫ్ ఖాతాదారులకు గుడ్ న్యూస్
ఈపీఎఫ్ఓ సభ్యులకు సేవలు మరింత సులభతరమయ్యాయి. ఇకపై యజమాని ప్రమేయం లేకుండా సభ్యులు EPF ఖాతా బదిలీకి దరఖాస్తు చేసుకునేలా కేంద్రం సేవలను ప్రారంభించింది. 2017 అక్టోబర్ 1 తర్వాత UAN జారీతో పాటు ఈ-కేవైసీ, ఆధార్ లింక్ పూర్తయినవారికే ఇది వర్తించనుంది. దీంతో వ్యక్తిగత వివరాల్లో తప్పుల సవరణ సభ్యులే స్వయంగా చేసుకోవచ్చు. ఆధార్ లింక్ చేయనివారికి యజమాని ధ్రువీకరణ తప్పనిసరి.
News January 19, 2025
కొత్త రేషన్ కార్డులు వీరికే..
TG: కొత్త రేషన్ కార్డులకు 2014 నాటి మార్గదర్శకాలనే ప్రాతిపదికగా తీసుకున్నారు. గ్రామాల్లో కుటుంబ వార్షికాదాయం రూ.1.50 లక్షలు, పట్టణాల్లో రూ.2 లక్షలుగా నిర్ణయించారు. అలాగే గ్రామాల్లో 3.50 ఎకరాలు అంతకంటే తక్కువ విస్తీర్ణంలో తరి(మాగాణి) పొలం ఉన్న రైతులు, 7.5 ఎకరాలు అంతకంటే తక్కువగా మెట్ట (కుష్కి) ఉన్న రైతులు అర్హులు. కొత్త కార్డుల కోసం JAN 21-24 వరకు గ్రామసభల్లో దరఖాస్తు చేసుకోవచ్చు.