News April 25, 2024
వేసవిలో 100 ప్రత్యేక రైళ్లు
వేసవి రద్దీ దృష్ట్యా ప్రత్యేక రైళ్లు నడుపుతున్నట్లు దక్షిణ మధ్య రైల్వే జోన్ అధికారులు తెలిపారు. ఈ నెల 28 నుంచి జులై 30 వరకు 100 స్పెషల్ ట్రైన్లను నడుపుతున్నట్లు చెప్పారు. విశాఖపట్నం- చెన్నై, తాంబరం-బరౌనీ, ఎరోడ్- ధన్బాద్, సత్రగాచి- బెంగళూరు, తాంబరం- ధన్బాద్, ముజఫాపూర్- సికింద్రాబాద్, మహబూబ్నగర్-గోరఖ్పూర్ తదితర స్టేషన్ల మధ్య ఈ రైళ్లు రాకపోకలు సాగిస్తాయని వెల్లడించారు.
Similar News
News January 20, 2025
కాంగ్రెస్ పాలనలో తెలంగాణకు ఒరిగింది ఏమిటి?: కేటీఆర్
TG: ఏడాది కాంగ్రెస్ పాలనలో కటింగులు, కటాఫ్లు మినహా తెలంగాణకు ఒరిగింది ఏమిటని కేటీఆర్ ప్రశ్నించారు. రుణమాఫీ, రైతుభరోసా, కరెంట్, కేసీఆర్ కిట్, తులం బంగారం, మహాలక్ష్మీ రూ.2,500తో సహా ఇచ్చిన హామీలన్నింటిలోనూ కటింగ్ చేస్తుందని దుయ్యబట్టారు. ‘అర్హులైన ప్రతి పేదవాడికి సొంత ఇళ్లు కట్టించి ఎందుకు ఇవ్వరు? డబుల్ బెడ్రూంలకు మూడురంగులు వేసి మురిపిస్తున్న కాంగ్రెస్ సర్కార్? జాగో తెలంగాణ జాగో’ అని రాసుకొచ్చారు.
News January 20, 2025
‘అమ్మా, నాన్న క్షమించండి.. బతకాలంటే భయమేస్తోంది’
AP: విజయనగరం(D) నెల్లిమర్ల మిమ్స్ మెడికల్ కాలేజీలో విద్యార్థి సాయి మణిదీప్(24) ఆత్మహత్య చేసుకున్నాడు. చనిపోయే ముందు ఫ్యామిలీకి అతడు రాసిన లేఖ కన్నీళ్లు పెట్టిస్తోంది. ‘డాడీ, అమ్మ, తమ్ముడు నన్ను క్షమించండి. కష్టపడి చదువుదామంటే నాతో కావడంలేదు. బతకాలంటే భయమేస్తోంది. 8-9 నెలల నుంచి సూసైడ్ ఆలోచనలు వస్తున్నాయి. పదేళ్లుగా మిమ్మల్ని చాలా కష్టపెట్టా. నాలాంటి పిచ్చోడు బతకకూడదు’ అని రాసిన లేఖ వైరలవుతోంది.
News January 20, 2025
బంగాళదుంపలు రోజూ తింటున్నారా?
బంగాళదుంపలను ఆహారంలో రోజు కాకుండా వారానికి రెండు, మూడు రోజులు తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. వీటికి వేడి స్వభావం ఉండటం వల్ల వాంతులు, విరేచనాలతో పాటు జీర్ణాశయ సమస్యలు వచ్చే అవకాశముందని అంటున్నారు. రక్తపోటు, మధుమేహ సమస్యలు ఉన్న వారు తినడం తగ్గించాలని సూచిస్తున్నారు. ముఖ్యంగా వీటిని నూనెలో వేయించి తినడం కంటే ఉడకబెట్టుకొని తినడం మేలు అని చెబుతున్నారు.