News May 24, 2024

జూన్ 3 నుంచి పదో తరగతి సప్లిమెంటరీ పరీక్షలు

image

TG: వచ్చే నెల 3 నుంచి పదో తరగతి సప్లిమెంటరీ పరీక్షలు జరగనున్నాయి. ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు వీటిని నిర్వహించనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 35 కేంద్రాల్లో 12,186మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకానున్నారు.

Similar News

News December 26, 2025

‘ఇండియా నన్ను బాగు చేసింది’.. NRI పోస్ట్ వైరల్

image

తన అనారోగ్యాన్ని ఇండియా నయం చేసిందని ఓ NRI చేసిన పోస్ట్ వైరలవుతోంది. ‘పదేళ్ల క్రితం US వెళ్లా. డేటా సైంటిస్టుగా పని చేస్తుండగా schizoaffective డిజార్డర్ (మానసిక వ్యాధి) ఉన్నట్లు 2018లో తేలింది. US హెల్త్ కేర్ సిస్టమ్ నన్ను భయపెట్టింది. దీంతో 2024లో ఇండియాకు వచ్చా. ఇప్పుడు నాకు నయమైంది. ఇక్కడి హెల్త్ సిస్టమ్, డాక్టర్ల వల్లే ఇది సాధ్యమైంది. నన్ను మనీ మెషీన్లుగా చూడలేదు’ అని రెడిట్‌లో రాసుకొచ్చారు.

News December 26, 2025

ఏపీ న్యూస్ అప్‌డేట్స్

image

*మత్స్యకారులకు 40% సబ్సిడీతో త్వరలో ఆటోలు అందిస్తామన్న మంత్రి DSBV స్వామి.. ప్రకాశం జిల్లా టంగుటూరు మండలంలో సబ్సిడీ వలలు పంపిణీ
*దివంగత కాపు ఉద్యమ నేత వంగవీటి మోహన రంగా వర్ధంతి సందర్భంగా వైఎస్ జగన్ నివాళులు అర్పించారు. పేద ప్రజల సమస్యలను తన సమస్యలుగా భావించారని ట్వీట్
*వరుస సెలవులతో హైదరాబాద్ నుంచి సొంతూళ్లకు ప్రయాణాలు.. విజయవాడ మార్గంలో ట్రాఫిక్ జామ్

News December 26, 2025

మరోసారి చెలరేగిన విరాట్ కోహ్లీ

image

విజయ్ హజారే ట్రోఫీలో విరాట్ కోహ్లీ మరోసారి తన క్లాస్‌ను చూపించారు. బెంగళూరు వేదికగా గుజరాత్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ఢిల్లీ తరఫున ఆడుతున్న కోహ్లీ 61 బంతుల్లో 77 పరుగులు (13 ఫోర్లు, 1 సిక్స్) చేసి ఔటయ్యారు. అంతకుముందు కేవలం 29 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నారు. గత 6 లిస్ట్-A మ్యాచ్‌ల్లో వరుసగా 74*, 135, 102, 65*, 131, 77 పరుగులతో విరాట్ అదరగొట్టారు.