News May 24, 2024

జూన్ 3 నుంచి పదో తరగతి సప్లిమెంటరీ పరీక్షలు

image

TG: వచ్చే నెల 3 నుంచి పదో తరగతి సప్లిమెంటరీ పరీక్షలు జరగనున్నాయి. ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు వీటిని నిర్వహించనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 35 కేంద్రాల్లో 12,186మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకానున్నారు.

Similar News

News December 26, 2025

అదానీ దూకుడు.. మూడేళ్లలో 33 కంపెనీలు!

image

గౌతమ్ అదానీకి చెందిన అదానీ గ్రూప్ మూడేళ్లలో 33 కంపెనీలను తన ఖాతాలో వేసుకుంది. 2023 జనవరి నుంచి ఇప్పటిదాకా ₹80 వేల కోట్లతో వాటిని దక్కించుకుంది. హిండెన్‌బర్గ్ <<9860361>>ఆరోపణల<<>> తర్వాత ఇన్వెస్టర్లలో నమ్మకాన్ని పెంచేందుకు ఈ కొనుగోళ్లు చేపట్టింది. ఇందులో అంబుజా, ACC, పెన్నా సిమెంట్, కరైకల్ పోర్టు, విదర్భ ఇండస్ట్రీస్ తదితర సంస్థలు ఉన్నాయి. రాబోయే ఐదేళ్లలో పలు రంగాల్లో ₹10 లక్షల కోట్ల పెట్టుబడులు పెట్టనుంది.

News December 26, 2025

మామిడిలో బోరాన్, పొటాష్ లోపాన్ని ఎలా గుర్తించాలి?

image

మామిడిలో బోరాన్ లోపం వల్ల చెట్ల ఆకులు కురచగా మారి ఆకుకొనలు నొక్కుకుపోయి పెళుసుగా మారతాయి. కాయలపై పగుళ్లు ఏర్పడతాయి. దీని నివారణకు ప్రతి మొక్కకు 100గ్రా. బోరాక్స్ భూమిలో వేయాలి లేదా లీటరు నీటికి 1ml-2ml బోరాక్స్ లేదా బోరికామ్లం కొత్త చిగురు వచ్చినప్పుడు 1-2 సార్లు పిచికారీ చేయాలి. ఆకుల అంచులు ఎండిపోతే పొటాష్ లోపంగా గుర్తించాలి. దీని నివారణకు లీటరు నీటికి 13:0:45 10గ్రా. కలిపి పిచికారీ చేయాలి.

News December 26, 2025

కోల్ ఇండియా లిమిటెడ్‌లో 125 పోస్టులు.. నేటి నుంచి దరఖాస్తుల ఆహ్వానం

image

<>కోల్ <<>>ఇండియా లిమిటెడ్ 125 ఇండస్ట్రీయల్ ట్రైనీ పోస్టులకు దరఖాస్తులు కోరుతోంది. అర్హతగల అభ్యర్థులు నేటి నుంచి జనవరి 5 వరకు అప్లై చేసుకోవచ్చు. పోస్టును బట్టి CA/CMA ఉత్తీర్ణులు అర్హులు. అభ్యర్థుల గరిష్ట వయసు 28 ఏళ్లు. రిజర్వేషన్ గలవారికి ఏజ్‌లో సడలింపు ఉంది. విద్యార్హతల్లో మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు. ట్రైనింగ్ సమయంలో నెలకు రూ.22వేలు స్టైపెండ్ చెల్లిస్తారు. వెబ్‌సైట్: https://www.coalindia.in/