News May 24, 2024
జూన్ 3 నుంచి పదో తరగతి సప్లిమెంటరీ పరీక్షలు

TG: వచ్చే నెల 3 నుంచి పదో తరగతి సప్లిమెంటరీ పరీక్షలు జరగనున్నాయి. ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు వీటిని నిర్వహించనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 35 కేంద్రాల్లో 12,186మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకానున్నారు.
Similar News
News January 1, 2026
నీటిపై పాఠాలు మీ దగ్గర నేర్చుకోవాలా?: హరీశ్

TG: నదీ జలాలపై పాఠాలు మీ దగ్గర నేర్చుకోవాలా? అని BRS నేత హరీశ్ CM రేవంత్పై ధ్వజమెత్తారు. ‘మీరు మాకు ఉపన్యాసాలు ఇస్తారా? మేడిగడ్డను ఎలా పేల్చారు, సుంకిశాలను ఎలా కూల్చారో చూపిస్తారా? కృష్ణాపై హక్కులను KRMBకి ఎలా అప్పగించారో చెబుతారా?’ అని ప్రశ్నించారు. ఈ రెండేళ్లలో అదనంగా ఒక్క ఎకరాకైనా సాగునీరు అందించారా? అని నిలదీశారు. సభలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్కు తమకూ అవకాశమివ్వాలని డిమాండ్ చేశారు.
News January 1, 2026
DPR లేని ప్రాజెక్టుకు రూ.27వేల కోట్లు చెల్లించారు: రేవంత్

TG: పార్టీని బతికించుకునేందుకు KCR మళ్లీ చంద్రబాబు పేరును, నీటి సెంటిమెంట్ను వాడుకుంటున్నారని CM రేవంత్ ఆరోపించారు. కృష్ణా జలాలపై మీడియాతో మాట్లాడారు. పాలమూరు-RR ప్రాజెక్టుకు KCR ఏడేళ్లు DPR సమర్పించలేదన్నారు. దీంతో పర్యావరణ అనుమతులు రాలేదని, అనుమతులు లేని ప్రాజెక్టు నిర్మిస్తున్నారంటూ కొందరు కేసులు వేశారన్నారు. DPR లేని ప్రాజెక్టుకు కమీషన్ల కోసం KCR రూ.27వేల Cr చెల్లించారని విమర్శించారు.
News January 1, 2026
FASTag: ఫిబ్రవరి 1 నుంచి KYV తొలగింపు

ఫాస్టాగ్ జారీలో జాప్యం లేకుండా నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా(NHAI) కీలక నిర్ణయం తీసుకుంది. లైట్ వెయిట్ వెహికల్స్ అయిన కార్లు, జీపులు, వ్యాన్లకు నో యువర్ వెహికల్(KYV) ప్రాసెస్ను తొలగిస్తున్నట్లు ప్రకటించింది. ఈ నిర్ణయం ఫిబ్రవరి FEB 1 నుంచి అమల్లోకి రానున్నట్లు పేర్కొంది. సరైన పత్రాలున్నప్పటికీ ఫాస్టాగ్ యాక్టివేషన్లో జాప్యం వల్ల ఇబ్బందులు ఎదుర్కొనే వాహనదారులకు దీని ద్వారా ఊరట లభించనుంది.


