News July 10, 2024
భారత్లో పదేళ్లలో 12.5 కోట్ల ఉద్యోగాలు: SBI

FY14 (2013-14) నుంచి FY23 మధ్య భారత్ 12.5కోట్ల ఉద్యోగాలు సృష్టించినట్లు SBI వెల్లడించింది. FY04-14 మధ్య ఈ సంఖ్య 2.9కోట్లకే పరిమితం అయిందని తెలిపింది. మాన్యుఫాక్చరింగ్, సర్వీస్ రంగాల్లో FY04-14 మధ్య 6.6కోట్ల ఉద్యోగాలు రాగా FY14-23 మధ్య ఆ సంఖ్య 8.9కోట్లుగా ఉన్నట్లు తన నివేదికలో పేర్కొంది. కాగా MSMEల్లో రిజిస్టర్ అయిన ఉద్యోగాల సంఖ్య 20కోట్లు దాటినట్లు కేంద్ర గణాంకాలు చెబుతున్నాయి.
Similar News
News November 27, 2025
రాష్ట్రంలో 60 పోస్టులు.. నేటి నుంచి దరఖాస్తుల ఆహ్వానం

తెలంగాణ స్టేట్ లెవల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డ్ (<
News November 27, 2025
చలికాలంలో పాదాలు పగులుతున్నాయా?

చలికాలంలో కనిపించే ప్రధాన సమస్యల్లో మడమల పగుళ్లు ఒకటి. చలి కాలంలో పొడి గాలుల కారణంగా మడమల చర్మంలో తేమ తగ్గుతుంది. ఈ కారణంగా చర్మం పొడిగా మారి పాదాలలో పగుళ్లు ఏర్పడుతాయి. కొన్నిసార్లు ఇన్ఫెక్షన్లు కూడా వస్తాయి. ఇలా కాకుండా ఉండాలంటే క్రమం తప్పకుండా మాయిశ్చరైజ్ అప్లై చేసి సాక్సులు ధరించాలని నిపుణులు సూచిస్తున్నారు. డీ హైడ్రేషన్ వల్ల కూడా పాదాలు పగులుతాయి కాబట్టి తగినంత నీరు తాగాలని చెబుతున్నారు.
News November 27, 2025
పారిపోయిన వారిని తీసుకొచ్చే హక్కు కేంద్రానికి ఉంది: సుప్రీంకోర్టు

నేరాలు చేసి విదేశాలకు పారిపోయిన వారిని తీసుకొచ్చే హక్కు కేంద్రానికి ఉందని సుప్రీంకోర్టు తెలిపింది. గుజరాత్కు చెందిన విజయ్ మురళీధర్ ఉద్వానీ కేసు విచారణలో జడ్జీలు జస్టిస్ విక్రమ్నాథ్, జస్టిస్ సందీప్ మెహతా ధర్మాసనం ఈ వ్యాఖ్యలు చేసింది. 2022 జులైలో దుబాయ్ పారిపోయిన ఉద్వానీపై గుజరాత్ హైకోర్టు రెడ్ కార్నర్ నోటీసు జారీ చేసింది. దానిని సవాల్ చేస్తూ వేసిన పిటిషన్ను సుప్రీంకోర్టు కొట్టేసింది.


