News March 5, 2025

12.9కి.మీ. కేదార్‌నాథ్ రోప్‌వేకు కేంద్రం ఆమోదం

image

చార్‌ధామ్ యాత్రలో కీలకమైన కేదార్‌నాథ్‌కు వెళ్లేందుకు ప్రయాణ కష్టాలు తప్పనున్నాయి. సోన్‌ప్రయాగ్ నుంచి కేదార్‌నాథ్ వరకు రూ.4,081 కోట్లతో రోప్‌వే నిర్మించేందుకు PM మోదీ ఆధ్వర్యంలోని కేంద్ర క్యాబినెట్ ఆమోదం తెలిపింది. మొత్తం 12.9కి.మీ. మేర రోప్‌వే వల్ల ఓ వైపునకు 8-9 గంటలు పట్టే ప్రయాణ సమయం కేవలం 36నిమిషాలకు తగ్గిపోనుంది. రోప్ వే నిర్మాణంలో ట్రై కేబుల్ డిటాచబుల్ గొండోలా టెక్నాలజీ(3S) ఉపయోగించనున్నారు.

Similar News

News April 11, 2026

వాట్సాప్‌లోనే రిజిస్ట్రేషన్ సర్వీసులు

image

TG: స్థిరాస్తులు, భూములకు సంబంధించిన స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ సేవలను వాట్సాప్ ద్వారా పొందవచ్చని ప్రభుత్వం తెలిపింది. 8096958096 నంబర్‌కు Hi అని మెసేజ్ చేయాలి. కావాల్సిన సర్వీసు ఎంచుకొని వివరాలు నమోదు చేసి, ఫాం నింపాలి. ఆ తర్వాత ఆన్‌లైన్ పేమెంట్ చేసి సర్వీసులు పొందవచ్చు. సబ్ రిజిస్ట్రార్ ఆమోదం తర్వాత సర్టిఫైడ్ EC కాపీ నేరుగా వాట్సాప్‌లోనే అందుతుంది.
Share It

News April 11, 2026

చంద్రుడిపై ప్లాట్లు.. ₹100 కోట్లు సంపాదించిన రియల్టర్

image

ఆర్టెమిస్-2 వ్యోమగాములు భూమికి తిరిగొచ్చిన వేళ చంద్రుడిపై ప్లాట్లు అమ్మే డెన్నిస్ హోప్ వార్త వైరలవుతోంది. 1980లో అంతర్జాతీయ చట్టాల్లోని లొసుగులను వాడుకుని చంద్రుడిని తన ఆస్తిగా ప్రకటించుకున్నారాయన. ఇప్పటి వరకు 70 లక్షల మందికి పైగా భూములు అమ్మి ₹100 కోట్లకు పైగా సంపాదించారు. సెలబ్రిటీలు సైతం ఇక్కడ ఎకరాల కొద్దీ కొనేసినట్లు టాక్. చట్టబద్ధత లేకపోయినా ఈ ‘మూన్ రియల్ ఎస్టేట్’ హాట్ టాపిక్‌గా మారింది.

News April 11, 2026

వేసవిలో అలోవెరా జ్యూస్ తాగితే..

image

వేసవిలో అలోవెరా జ్యూస్ తాగితే శరీరానికి చలువ చేస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ‘ఇది శరీర వేడిని తగ్గించి హైడ్రేటెడ్‌గా ఉంచుతుంది. పరగడుపున తాగితే జీర్ణక్రియ మెరుగవుతుంది. చర్మం కాంతివంతంగా మారుతుంది. షుగర్ కంట్రోల్ అవుతుంది. ఇమ్యూనిటీ పెరుగుతుంది’ అని అంటున్నారు. ‘రోజుకు 50-120ml మాత్రమే తీసుకోవాలి. జెల్‌ను నీటితో కడిగి మిక్సీలో వేసి నీరు, నిమ్మరసం/తేనె కలుపుకోవాలి’ అని సూచిస్తున్నారు.