News March 25, 2024
శ్రీవారి సర్వదర్శనానికి 12 గంటల సమయం

AP: తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్లోని అన్ని కంపార్ట్మెంట్లు భక్తులతో నిండిపోయాయి. ఇవాళ శ్రీవారి సర్వదర్శనానికి 12 గంటల సమయం పడుతోంది. నిన్న శ్రీవారిని 80,532 మంది భక్తులు దర్శించుకున్నారు. 29,438 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. హుండీ ఆదాయం రూ.3.95 కోట్లు వచ్చిందని టీటీడీ అధికారులు తెలిపారు.
Similar News
News October 22, 2025
కుంకుమపువ్వుతో మహిళలకు ఎన్నో లాభాలు

కుంకుమపువ్వుతో మహిళలకు ఎన్నో ప్రయోజనాలున్నాయంటున్నారు నిపుణులు. హార్మోన్ల సమతుల్యతను కాపాడటంతో పాటు బీపీ, కొలెస్ట్రాల్ను అదుపులో ఉంచి గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. గుండె ఆరోగ్యాన్ని కాపాడే క్రోసెటిన్, క్రోసిన్ కుంకుమపువ్వులో ఉంటాయంటున్నారు. రోగనిరోధకశక్తిని పెంచడంలో కూడా ఇది తోడ్పడుతుంది. పాలలో కలుపుకొని తాగటం లేదా కుంకుమ పువ్వు టీ చేసుకొని తాగడం మంచిదని సూచిస్తున్నారు.
News October 22, 2025
మహిళలకు నెలకు రూ.30 వేలు.. RJD కొత్త పథకం

బిహార్ అసెంబ్లీ ఎన్నికల వేళ పార్టీలు హామీలతో ప్రజలను ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డాయి. ఇటీవల JDU-BJP ప్రభుత్వం స్వయం ఉపాధి కోసం మహిళల అకౌంట్లలో రూ.10 వేలు జమ చేయడం తెలిసిందే. తాజాగా RJD చీఫ్ తేజస్వీ యాదవ్ మహిళా సంఘాల సభ్యులను శాశ్వత ప్రభుత్వ ఉద్యోగులను చేస్తామని హామీ ఇచ్చారు. అధికారంలోకి వస్తే ‘జీవికా CM’ స్కీం పేరిట ప్రతి నెల రూ.30,000 జీతం ఇస్తామన్నారు. లోన్లపై వడ్డీ మాఫీ చేస్తామని ప్రకటించారు.
News October 22, 2025
సినీ ముచ్చట్లు

*ప్రభాస్-హను రాఘవపూడి సినిమా థీమ్ను తెలుపుతూ కొత్త పోస్టర్ విడుదల. రేపు 11.07AMకు టైటిల్ పోస్టర్ రిలీజ్ చేస్తామని ప్రకటన
*నవంబర్ 14న ‘డ్యూడ్’ ఓటీటీ విడుదలకు నెట్ఫ్లిక్స్ ప్లాన్!
*త్రివిక్రమ్-విక్టరీ వెంకటేశ్ కొత్త సినిమాలో హీరోయిన్గా KGF బ్యూటీ శ్రీనిధి శెట్టి ఎంపిక
*ముంబైలో శిల్పాశెట్టి రెస్టారెంట్.. రోజుకు రూ.2-3 కోట్ల ఆదాయం!