News March 25, 2024

శ్రీవారి సర్వదర్శనానికి 12 గంటల సమయం

image

AP: తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని అన్ని కంపార్ట్‌మెంట్లు భక్తులతో నిండిపోయాయి. ఇవాళ శ్రీవారి సర్వదర్శనానికి 12 గంటల సమయం పడుతోంది. నిన్న శ్రీవారిని 80,532 మంది భక్తులు దర్శించుకున్నారు. 29,438 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. హుండీ ఆదాయం రూ.3.95 కోట్లు వచ్చిందని టీటీడీ అధికారులు తెలిపారు.

Similar News

News December 7, 2025

సేంద్రియ ఎరువులతో సాగుకు లాభం

image

సేంద్రియ ఎరువులు నేల భౌతిక లక్షణాలను మెరుగుపరుస్తాయి. మొక్కలకు అవసరమైన ముఖ్యమైన పోషకాలు తగిన మోతాదులో అందుతాయి. సేంద్రియ పదార్ధాలు భూమిలో మరింత మార్పుచెంది హ్యూమస్ అనే విలువైన పదార్థం తయారవుతుంది. ఇది పోషకాలను అధికంగా పట్టిఉంచి మొక్కకు సమర్ధవంతంగా అందిస్తుంది. సేంద్రియ ఎరువుల వాడకంతో నేలలో మొక్కలకు హాని కలిగించే శిలీంధ్రాలు, నులిపురుగుల ఉద్ధృతి, చీడపీడల తాకిడి తగ్గుతుందంటున్నారు నిపుణులు.

News December 7, 2025

నా పెళ్లి క్యాన్సిల్ అయింది: స్మృతి

image

తన పెళ్లి క్యాన్సిల్ అయిందని క్రికెటర్ <<18479493>>స్మృతి<<>> మంధాన ప్రకటించారు. ‘గత కొన్ని వారాలుగా నా జీవితంపై ఎన్నో వదంతులు వస్తున్నాయి. నా పెళ్లి క్యాన్సిల్ అయిందని క్లారిటీ ఇస్తున్నా. నేను ఈ మ్యాటర్‌ను ఇంతటితో వదిలేస్తున్నా. మీరూ నాలాగే చేయండి. ఇరు కుటుంబాల ప్రైవసీని గౌరవించాలని రిక్వెస్ట్ చేస్తున్నా. ఇండియా తరఫున ఆడుతూ ఎన్నో ట్రోఫీలు గెలవడమే నా లక్ష్యం’ అని ఇన్‌స్టాలో పోస్ట్ చేశారు.

News December 7, 2025

ఉప్పల్‌లో మెస్సీ మ్యాచ్‌కు పకడ్బందీ ఏర్పాట్లు

image

TG: ఈనెల 13న ఉప్పల్ స్టేడియంలో లియోనెల్ మెస్సీ-CM రేవంత్ రెడ్డి ఫ్రెండ్లీ <<18413680>>మ్యాచ్‌<<>> ఆడనున్న విషయం తెలిసిందే. దీనిని చూసేందుకు దేశం నలుమూలల నుంచి అభిమానులు రానున్నారని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. మ్యాచ్ ఏర్పాట్లు, భద్రతా చర్యలను ఆయన అధికారులతో కలిసి పరిశీలించారు. ప్రత్యేక భద్రతా వ్యవస్థ అమలు చేస్తున్నట్లు చెప్పారు. నిర్ణీత సమయానికి ముందే ప్రేక్షకులు స్టేడియానికి చేరుకోవాలని సూచించారు.