News May 3, 2024

శ్రీవారి సర్వదర్శనానికి 12 గంటల సమయం

image

తిరుమలకు భక్తులు పోటెత్తుతున్నారు. వేసవి సెలవులు కావడంతో గత రెండు రోజులుగా రద్దీ పెరిగింది. ప్రస్తుతం 26 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. శ్రీవారి సర్వదర్శనానికి 12 గంటల సమయం పడుతోంది. నిన్న స్వామివారిని 65,313 మంది భక్తులు దర్శించుకున్నారు. 28,780 మంది తలనీలాలు సమర్పించారు. హుండీ ఆదాయం రూ.3.54 కోట్లు వచ్చినట్లు టీటీడీ అధికారులు తెలిపారు.

Similar News

News October 7, 2025

డిసెంబర్ లేదా జనవరిలో మున్సిపల్ ఎన్నికలు?

image

TG: డిసెంబర్ లేదా జనవరిలో మున్సిపల్, కార్పొరేషన్ ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. GHMC పరిధి మున్సిపాలిటీలతో పాటు మరో 10 స్థానాలకు ఇంకా గడువు పూర్తి కాలేదు. అవి మినహా మిగిలిన 123 స్థానాల్లో ఎన్నికలు జరగాల్సి ఉంది. వీటిలో ఇప్పటికే వార్డుల విభజన పూర్తయింది. కొత్త మున్సిపాలిటీలు ఇంద్రేశం, జిన్నారంతో పాటు ఇస్నాపూర్, గజ్వేల్‌‌లో వార్డుల విభజనకు త్వరలో షెడ్యూల్ రానుంది.

News October 7, 2025

అలా చేస్తేనే రోహిత్, కోహ్లీ టీమ్‌లో ఉంటారు: ABD

image

2027 ODI WC టీమ్‌లో చోటు దక్కాలంటే రోహిత్, కోహ్లీ పరుగులు చేయాల్సిందేనని SA మాజీ క్రికెటర్ డివిలియర్స్ అన్నారు. ‘WC వరకు రోహిత్, కోహ్లీ జట్టులో ఉంటారన్న గ్యారంటీ లేదు. అందుకే గిల్‌ను కెప్టెన్ చేశారు. ఇది సరైన నిర్ణయమే. వారిద్దరి నుంచి అతడు నేర్చుకునే అవకాశం ఉంటుంది. టీమ్ ఇండియాలో కాంపిటిషన్ ఎక్కువ కాబట్టి రోహిత్, కోహ్లీ రన్స్ చేయక తప్పదు. వారు రాణిస్తారనే నమ్మకం ఉంది’ అని పేర్కొన్నారు.

News October 7, 2025

ఆంజనేయుడికి అప్పాల మాల ఎందుకు?

image

సూర్యుడిని పండుగా భావించి బాల హనుమ ఆకాశానికి ఎగిరాడు. అప్పుడే రాహువు కూడా రవిని పట్టుకోబోతున్నాడు. ఈ క్రమంలో హనుమంతుడే మొదట భానుడి వద్దకు చేరుకున్నాడు. అప్పుడు అంజని పుత్రుడి శౌర్యాన్ని మెచ్చిన రాహువు తన భక్తులకు ఓ వరమిచ్చాడు. తనకిష్టమైన మినపపప్పుతో చేసిన ప్రసాదాన్ని ఆంజనేయుడి మెడలో మాలగా సమర్పిస్తే.. వారికి రాహు దోషం నుంచి ఉపశమనం లభిస్తుంది. అలా ఈ గారెల మాల సమర్పణ ఆనవాయితీగా మారింది.