News May 3, 2024

శ్రీవారి సర్వదర్శనానికి 12 గంటల సమయం

image

తిరుమలకు భక్తులు పోటెత్తుతున్నారు. వేసవి సెలవులు కావడంతో గత రెండు రోజులుగా రద్దీ పెరిగింది. ప్రస్తుతం 26 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. శ్రీవారి సర్వదర్శనానికి 12 గంటల సమయం పడుతోంది. నిన్న స్వామివారిని 65,313 మంది భక్తులు దర్శించుకున్నారు. 28,780 మంది తలనీలాలు సమర్పించారు. హుండీ ఆదాయం రూ.3.54 కోట్లు వచ్చినట్లు టీటీడీ అధికారులు తెలిపారు.

Similar News

News October 13, 2025

ఓట్ చోరీ ఆరోపణలపై పిల్.. తిరస్కరించిన సుప్రీం

image

కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేసిన ‘ఓట్ చోరీ’ ఆరోపణలపై దాఖలైన PILను సుప్రీంకోర్టు రిజెక్ట్ చేసింది. ఓట్ చోరీ అంశంపై దర్యాప్తుకు SIT ఏర్పాటు చేయాలన్న అడ్వకేట్ రోహిత్ పాండే విజ్ఞప్తిని తిరస్కరించింది. దీనిపై ECని పిటిషనర్ సంప్రదించవచ్చని చెప్పింది. అయితే ఎలక్షన్ కమిషన్‌ను గతంలో ఆశ్రయించినా చర్యలు తీసుకోలేదని ఆయన బదులిచ్చారు. దీంతో ప్రత్యామ్నాయ మార్గాలు అనుసరించాలని సూచిస్తూ PILను SC డిస్మిస్ చేసింది.

News October 13, 2025

కూల్ అండ్ గ్లో ఫేస్ ప్యాక్

image

పొడిచర్మం ఉన్నవారు పలు చర్మ సమస్యలను ఎదుర్కొంటారు. వారి చర్మంలోని మాయిశ్చర్‌ని రిస్టోర్ చేయడానికి ఈ బీట్‌రూట్ ఫేస్‌ప్యాక్ పనిచేస్తుంది. ముందుగా బీట్‌రూట్ జ్యూస్, శనగపిండి, పెరుగు, తేనె కలుపుకోవాలి. దీన్ని ముఖానికి అప్లై చేసి 10 ని. తర్వాత శుభ్రం చేసుకుంటే చర్మం తాజాగా, కాంతిమంతంగా మారుతుంది. వారానికి మూడుసార్లు ఈ ప్యాక్‌ను అప్లై చేసుకోవడం వల్ల చర్మం తాజాగా ఉంటూ మెరుపును సంతరించుకుంటుంది. <<-se>>#skincare<<>>

News October 13, 2025

అంతర్గాంలో గ్రీన్‌ఫీల్డ్ ఎయిర్‌పోర్టుకు పరిశీలన

image

TG: రాష్ట్రంలో ఎయిర్ కనెక్టివిటీని పెంచాలని ప్రభుత్వం భావిస్తోంది. గ్రీన్‌ఫీల్డ్ ఎయిర్ పోర్టుకు గతంలో ఎంపికచేసిన పెద్దపల్లి(D) బసంత్‌నగర్ అనుకూలంగా లేకపోవడంతో సమీపంలోని అంతర్గాం ప్రాంతాన్ని పరిశీలిస్తోంది. టెక్నో ఎకనామిక్ ఫీజుబులిటీ నివేదిక కోసం AAIకి ఫీజు చెల్లించనుంది. ఇప్పటికే మామునూరు(WGL)ను ఫైనల్ చేసిన ప్రభుత్వం కొత్తగూడెం, ఆదిలాబాద్, మహబూబ్‌నగర్, నిజామాబాద్‌లలో ఎయిర్‌పోర్టులపై ఆలోచిస్తోంది.