News February 10, 2025

కుంభమేళాలో 12 మంది జననం.. పేర్లు ఇవే

image

మహాకుంభ మేళా సందర్భంగా ప్రయాగ్‌రాజ్‌లో ఏర్పాటుచేసిన సెంట్రల్ హాస్పిటల్‌లో 12 మంది మహిళలు బిడ్డలకు జన్మనిచ్చినట్లు అధికారులు తెలిపారు. అన్నీ సాధారణ కాన్పులేనని చెప్పారు. వీరిలో యూపీ, మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఝార్ఖండ్ రాష్ట్రాలవారు ఉన్నారన్నారు. ఆడపిల్లలకు బసంతి, గంగా, జమున, బసంత్ పంచమి, సరస్వతి, మగ బిడ్డలకు కుంభ్, భోలేనాథ్, బజ్‌రంగీ, నంది తదితర పేర్లు పెట్టినట్లు వివరించారు.

Similar News

News April 19, 2026

నాసా ఫొటో.. వెలుగు జిలుగుల్లో యూపీ, బిహార్!

image

భూమి నైట్ లైఫ్‌పై NASA ఇటీవల రిలీజ్ చేసిన ఇమేజెస్ వైరలవుతున్నాయి. ఇందులో భారత్.. ముఖ్యంగా ఉత్తరాది రాష్ట్రాలైన యూపీ, బిహార్‌లు విద్యుత్ వెలుగుల్లో మెరిసిపోతున్నాయి. 2014-2022 మధ్య తొమ్మిదేళ్ల పాటు రాత్రి వేళ ఉపగ్రహాలు తీసిన 1.16 మిలియన్ శాటిలైట్ ఇమేజెస్‌ ఆధారంగా నాసా వీటిని రిలీజ్ చేసింది. వెనుకబడిన రాష్ట్రంగా పరిగణించే బిహార్ విద్యుత్ వెలుగుల్లో టాప్‌లో ఉండటం చూసి నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు.

News April 19, 2026

నాసా ఫొటో.. వెలుగు జిలుగుల్లో యూపీ, బిహార్!

image

భూమి నైట్ లైఫ్‌పై NASA ఇటీవల రిలీజ్ చేసిన ఇమేజెస్ వైరలవుతున్నాయి. ఇందులో భారత్.. ముఖ్యంగా ఉత్తరాది రాష్ట్రాలైన యూపీ, బిహార్‌లు విద్యుత్ వెలుగుల్లో మెరిసిపోతున్నాయి. 2014-2022 మధ్య తొమ్మిదేళ్ల పాటు రాత్రి వేళ ఉపగ్రహాలు తీసిన 1.16 మిలియన్ శాటిలైట్ ఇమేజెస్‌ ఆధారంగా నాసా వీటిని రిలీజ్ చేసింది. వెనుకబడిన రాష్ట్రంగా పరిగణించే బిహార్ విద్యుత్ వెలుగుల్లో టాప్‌లో ఉండటం చూసి నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు.

News April 19, 2026

రేపు సీఎం vs మాజీ సీఎం

image

TG: చాలా రోజుల గ్యాప్ తర్వాత రాష్ట్ర రాజకీయాలు మరోసారి వేడెక్కనున్నాయి. రేపు CM, మాజీ CM బహిరంగ సభల్లో పాల్గొననున్నారు. సీఎం రేవంత్ భూపాలపల్లి (D) కాటారంలో రైతుభరోసా నిధులను విడుదల చేయనున్నారు. ప్రతిపక్షాలపై విమర్శలు ఎక్కుపెట్టే అవకాశం ఉంది. అటు జీవన్ రెడ్డి BRSలో చేరిక సందర్భంగా జగిత్యాల సభకు KCR హాజరుకానున్నారు. ఆయన అధికార పార్టీపై ఎలాంటి విమర్శనాస్త్రాలతో వస్తారనేది ఆసక్తికరంగా మారింది.