News April 12, 2024
రైల్వే శాఖలో 15శాతం డ్రైవర్ పోస్టులు ఖాళీ
రైల్వే శాఖలో 15% డ్రైవర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయని రైల్వే బోర్డు వెల్లడించింది. ఆర్టీఐ ద్వారా అడిగిన ప్రశ్నకు సమాధానమిచ్చింది. మొత్తం 1,27,644 డ్రైవర్, అసిస్టెంట్ డ్రైవర్ పోస్టులు మంజూరు కాగా, అందులో 2024 మార్చి 1 నాటికి 18,766 (14.7%) పోస్టులు ఖాళీగా ఉన్నట్లు పేర్కొంది. అలాగే 14,429 లోకో పైలట్ పోస్టులు, 4,337 అసిస్టెంట్ లోకో పైలట్ పోస్టులు ఖాళీగా ఉన్నాయని తెలిపింది.
Similar News
News October 11, 2024
స్విగ్గీ బాయ్కాట్ నిర్ణయం వెనక్కి
AP: ఈ నెల 14 నుంచి స్విగ్గీ ఆన్లైన్ ఫుడ్ డెలివరీ యాప్ <<14272365>>బాయ్కాట్<<>> చేయాలన్న నిర్ణయాన్ని హోటళ్లు, రెస్టారెంట్ల అసోసియేషన్ వెనక్కి తీసుకుంది. స్విగ్గీ యాజమాన్యంతో చర్చలు సానుకూలంగా జరగడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. నవంబర్ 1 నుంచి స్విగ్గీతో ఒప్పందాలు అమల్లోకి వస్తాయని పేర్కొంది.
News October 11, 2024
ఎన్కౌంటర్ మృతులు 34: బస్తర్ ఐజీ
ఈ నెల 5న ఛత్తీస్గఢ్లోని దంతెవాడ సమీపంలో జరిగిన ఎన్కౌంటర్లో మరణించిన వారి సంఖ్య 34 అని బస్తర్ ఐజీ సుందర్ రాజ్ తెలిపారు. తాము 31 మంది మావోయిస్టుల మృతదేహాలను స్వాధీనం చేసుకున్నామని చెప్పారు. మిగిలిన 3 మృతదేహాలను మావోయిస్టులు అడవిలోనే ఖననం చేసినట్లు పేర్కొన్నారు.
News October 11, 2024
మోదీ బహుమతిగా ఇచ్చిన కిరీటం చోరీ
బంగ్లాదేశ్లోని జెశోరేశ్వరి ఆలయంలోని కాళీ మాత కిరీటం చోరీకి గురైంది. ఈ కిరీటాన్ని 2021లో బంగ్లాకు వెళ్లిన సమయంలో ప్రధాని మోదీ దీనిని బహుమతిగా ఇచ్చారు. నిన్న మధ్యాహ్నం ఈ దొంగతనం జరిగినట్లు పోలీసులు తెలిపారు. ఆలయ సీసీటీవీ విజువల్స్ ద్వారా దొంగను గుర్తించే పనిలో ఉన్నట్లు చెప్పారు. కాగా ఈ కిరీటం వెండి, బంగారు లోహాలతో తయారు చేశారు.