News August 11, 2024
15 నుంచి రెవెన్యూ సదస్సులు: అనగాని

AP: రాష్ట్రంలో ఈ నెల 15 నుంచి 30 వరకు రెవెన్యూ సదస్సులు నిర్వహించనున్నట్లు మంత్రి అనగాని సత్యప్రసాద్ తెలిపారు. ‘ప్రతి గ్రామంలో ఈ సదస్సులు జరుగుతాయి. భూ ఆక్రమణలు, 22ఏ భూముల అక్రమాలతోపాటు పలు రెవెన్యూ సమస్యలపై ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరిస్తాం. ఆ ఫిర్యాదులను విచారణ జరిపి ఆన్లైన్ చేసి పరిష్కరిస్తాం’ అని మంత్రి వివరించారు.
Similar News
News March 7, 2026
పాక్లో భారీగా పెరిగిన పెట్రోల్ ధరలు

ఇరాన్-US యుద్ధం నేపథ్యంలో పాకిస్థాన్లో పెట్రోల్ ధరలకు రెక్కలొచ్చాయి. ప్రభుత్వం లీటర్పై ఏకంగా 55 PKR(17 శాతం) పెంచింది. దీంతో లీటర్ పెట్రోల్ ధర 266.17 PKR నుంచి 321.17 PKRకు పెరిగింది. హైస్పీడ్ డీజిల్ ధర లీటర్కు 280.86 నుంచి 335.86కి(20%) ఎగిసింది. ఈ పరిస్థితి ఎంతకాలం ఉంటుందో చెప్పలేమని పాక్ పెట్రోలియం మంత్రి మాలిక్ అన్నారు. ఇండియాలోనూ <<19316911>>గ్యాస్ ధరలు<<>> పెరిగిన విషయం తెలిసిందే.
News March 7, 2026
విటమిన్ల కోసం వీటిని తీసుకోండి!

శరీర ఎదుగుదలకు, రోగనిరోధక శక్తికి విటమిన్లు అత్యవసరం. క్యారెట్లు, లివర్లో విటమిన్ A ఉంటుంది. B1- తృణధాన్యాలు, చిక్కుళ్లు. B2- పాలు, గుడ్లు, పాలకూర. B3 – చికెన్, వేరుశెనగ. B5- అవకాడో, గుడ్లు. B6- అరటిపండు, సాల్మన్ ఫిష్. B7- గుడ్లు, బాదం, కాలీఫ్లవర్. B12- చేపలు, మాంసం, పాల ఉత్పత్తులు. D – సూర్యకాంతి, చేపలు, పాలు. K- కాలే, బ్రోకలీ, సోయాబీన్స్. E- సన్ఫ్లవర్ సీడ్స్, బాదం. C -నారింజ, జామ. SHARE IT
News March 7, 2026
విజయ్కి భార్య షాక్.. కోర్టులో మరో పిటిషన్!

టీవీకే అధినేత విజయ్కి ఆయన భార్య సంగీత <<19295692>>మరోసారి<<>> షాక్ ఇచ్చారు. చెంగల్పట్టు ఫ్యామిలీ కోర్టులో ఆమె మరో పిటిషన్ దాఖలు చేశారు. తమ విడాకుల కేసు ముగిసే వరకు తాను విజయ్ ఇంట్లోనే ఉండేందుకు అనుమతివ్వాలని అందులో కోరారు. ‘చెన్నై నీలంకరైలోని ఇంట్లో నాకూ సగం వాటా ఉంది. విడాకుల కేసు ముగిసే వరకు, నేను వేరే ఇంటికి మారే వరకు అక్కడ ఉండేందుకు అనుమతించాలి’ అని తన పిటిషన్లో కోరినట్లు తెలుస్తోంది.


