News December 23, 2024

మహిళా సంఘాల ద్వారా RTCకి 150 ఎలక్ట్రిక్ బస్సులు: సీఎస్

image

TG: రాష్ట్రంలో తొలి విడతలో 5 జిల్లాల్లోని 231 ఎకరాల్లో స్వయం సహాయక బృందాలచే సోలార్ ప్లాంట్లు ఏర్పాటు చేయించాలని సీఎస్ శాంతికుమారి అధికారులను ఆదేశించారు. 6 నెలల్లో ఆలయ భూముల్లో వీటిని ఏర్పాటు చేయాలని తెలిపారు. సోలార్ ప్లాంట్లు, ఎలక్ట్రిక్ బస్సులు ఇవ్వడంపై అధికారులతో సీఎస్ సమీక్ష నిర్వహించారు. మహిళా సంఘాల నుంచి ఆర్టీసీకి 150 ఎలక్ట్రిక్ బస్సులు తీసుకురానున్నట్లు పేర్కొన్నారు.

Similar News

News November 23, 2025

1, 2, 3 ఇవి ర్యాంకులు కాదు.. కరీంనగర్ – జమ్మికుంట బస్సులు

image

కరీంనగర్ – అన్నారం – చల్లూర్ – వీణవంక – జమ్మికుంట రూట్‌లో బస్సుల రాకపోకలపై ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉదయం 6 గంటల నుంచి 9 గంటల వరకు ప్రతి అరగంటకు ఒక బస్సు వస్తున్నా, ఆ తర్వాత ఈ రూట్‌లో ఒక్కోసారి ఒకేసారి మూడు బస్సులు వస్తాయని, లేదంటే గంట, గంటన్నర వరకు బస్సులే ఉండవని ప్రయాణికులు వాపోతున్నారు. అధికారులు స్పందించి, సమయపాలనను సరిచేసి సమస్యను పరిష్కరించాలని కోరుతున్నారు.

News November 23, 2025

సామ్ కరన్ ఎంగేజ్‌మెంట్

image

ఇంగ్లండ్ క్రికెటర్ సామ్ కరన్ తన ప్రియురాలు ఇసాబెల్లా గ్రేస్‌ను పరిచయం చేశారు. ఆమెకు పెళ్లి ప్రపోజ్ చేస్తూ, ఎంగేజ్‌మెంట్ చేసుకున్నట్లు ప్రకటించారు. వీరు తొలిసారిగా 2018లో పరిచయమయ్యారు. ఆ తర్వాత అది ప్రేమగా మారింది. ఇసాబెల్లా 1998న ఇంగ్లండ్‌లో జన్మించారు. థియేటర్ ఆర్టిస్టుగా పని చేస్తున్నారు. అటు సామ్ కరన్ వచ్చే సీజన్లో రాజస్థాన్ రాయల్స్ తరఫున ఆడనున్నారు.

News November 23, 2025

పిల్లలు బరువు తగ్గుతున్నారా?

image

పిల్లలు పుట్టినప్పుడు సరైన బరువుతో ఉన్నా ఆ తర్వాత బరువు తగ్గిపోతున్నారని చాలామంది పేరెంట్స్ వైద్యులను సంప్రదిస్తుంటారు. ఇది సాధారణమే అంటున్నారు నిపుణులు. పుట్టినప్పుటి బరువులో 6-7 శాతం వరకు తగ్గుతారట. డబ్బా పాలు తాగేవారిలో 3-4 శాతం తగ్గుదల కనిపిస్తుంది. చిన్నారులు పుట్టినప్పటి బరువుతో పోలిస్తే ఐదు నుంచి ఆరు నెలల తర్వాత రెట్టింపు బరువు పెరిగితే వారు ఆరోగ్యంగా ఉన్నట్లేనని చెబుతున్నారు.