News May 12, 2024
శ్రీవారి సర్వదర్శనానికి 16 గంటల సమయం

తిరుమలలో భక్తుల రద్దీతో వైకుంఠం క్యూ కాంప్లెక్స్లోని కంపార్టుమెంట్లన్నీ నిండిపోయాయి. టోకెన్ లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 16 గంటల సమయం పడుతోంది. నిన్న స్వామివారిని 76,945 మంది భక్తులు దర్శించుకోగా.. 33,844 మంది తలనీలాలు సమర్పించారు. హుండీ ఆదాయం రూ.2.67 కోట్లు వచ్చినట్లు టీటీడీ అధికారులు తెలిపారు.
Similar News
News November 27, 2025
ఆ మృగం మూల్యం చెల్లించుకోక తప్పదు: ట్రంప్

వాషింగ్టన్లోని వైట్హౌస్ వద్ద <<18399882>>కాల్పుల ఘటనపై<<>> US అధ్యక్షుడు ట్రంప్ ఘాటుగా స్పందించారు. నిందితుడిని మృగంగా సంబోధిస్తూ.. భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. ‘ఇద్దరు నేషనల్ గార్డ్మెన్లను ఆ యానియల్ తీవ్రంగా గాయపర్చింది. వారికి చికిత్స అందిస్తున్నాం. నిందితుడిని వదలబోం’ అని సోషల్ మీడియాలో పోస్టు చేశారు. కాల్పుల నేపథ్యంలో వైట్హౌస్ను లాక్డౌన్ చేసిన విషయం తెలిసిందే.
News November 27, 2025
చెప్పులు, చెత్త డబ్బా.. ‘సర్పంచ్’ గుర్తులివే..

TG: సర్పంచ్ అభ్యర్థులకు SEC 30గుర్తులు కేటాయించింది. వీటిలో చెప్పులు, చెత్తడబ్బా, బిస్కెట్, బెండకాయ, రింగు, కత్తెర, బ్యాట్, ఫుట్బాల్, లేడీస్ పర్స్, రిమోట్, టూత్ పేస్ట్, బ్లాక్ బోర్డు, కొబ్బరితోట, వజ్రం, బకెట్, డోర్ హ్యాండిల్, టీ జాలి, చేతికర్ర, మంచం, పలక, టేబుల్, బ్యాటరీ లైట్, బ్రష్, బ్యాట్స్మెన్, పడవ, ఫ్లూట్, చైన్, బెలూన్, స్టంప్స్, స్పానర్ గుర్తులున్నాయి. వార్డు అభ్యర్థులకు 20గుర్తులిచ్చింది.
News November 27, 2025
3,445 ప్రభుత్వ ఉద్యోగాలు.. BIG UPDATE

NTPC అండర్ గ్రాడ్యుయేట్-2024 CBT-II షెడ్యూల్ను RRB విడుదల చేసింది. DEC 20న ఈ పరీక్షను నిర్వహిస్తామని తెలిపింది. ఎగ్జామ్కు 4 రోజుల ముందు అడ్మిట్ కార్డులను రిలీజ్ చేస్తామంది. గత ఏడాది 3,445 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ వెలువడిన విషయం తెలిసిందే. ఇటీవల విడుదలైన CBT-1 ఫలితాల్లో తదుపరి దశకు 51,979 మంది అర్హత సాధించారు.


