News May 12, 2024

శ్రీవారి సర్వదర్శనానికి 16 గంటల సమయం

image

తిరుమలలో భక్తుల రద్దీతో వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని కంపార్టుమెంట్లన్నీ నిండిపోయాయి. టోకెన్‌ లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 16 గంటల సమయం పడుతోంది. నిన్న స్వామివారిని 76,945 మంది భక్తులు దర్శించుకోగా.. 33,844 మంది తలనీలాలు సమర్పించారు. హుండీ ఆదాయం రూ.2.67 కోట్లు వచ్చినట్లు టీటీడీ అధికారులు తెలిపారు.

Similar News

News February 13, 2025

రాష్ట్రపతి పాలన ఎప్పుడు విధిస్తారు?

image

రాష్ట్రంలో క్లిష్ట పరిస్థితులు తలెత్తడం, రాజ్యాంగబద్ధ పాలన అందించడంలో ప్రభుత్వం విఫలమైనప్పుడు గవర్నర్ నివేదిక ఇస్తారు. దీని ఆధారంగా PM నేతృత్వంలోని మంత్రి వర్గం సిఫార్సులతో ఆర్టికల్ 356(1) ప్రకారం <<15452930>>రాష్ట్రపతి పాలన<<>> విధిస్తారు. ఆ తర్వాత పాలనా వ్యవహారాలను రాష్ట్రపతి సూచనతో గవర్నర్ పర్యవేక్షిస్తారు. ఆర్టికల్ 356(4) ప్రకారం 6నెలలు ఈ పాలన కొనసాగుతుంది. పార్లమెంటు ఆమోదంతో గరిష్ఠంగా 3ఏళ్లు విధించొచ్చు.

News February 13, 2025

2028కల్లా గగన్‌యాన్ మానవసహిత ప్రయోగం

image

గగన్‌యాన్ మానవసహిత ప్రయోగాన్ని 2028కల్లా చేపట్టనున్నట్లు శాస్త్ర సాంకేతిక శాఖ మంత్రి జితేంద్ర సింగ్ పార్లమెంటుకు లిఖితపూర్వక సమాధానంలో తెలిపారు. ‘గగన్‌యాన్‌లో మొత్తం 8 మిషన్స్ ఉంటాయి. వాటిలో 6 మానవరహితంగా, 2 మానవ సహితంగా ఉంటాయి. తొలి ప్రయోగాన్ని ఈ ఏడాది చేపడతాం. గగన్‌యాన్‌కు రూ.20,193 కోట్లను కేటాయించాం’ అని వివరించారు.

News February 13, 2025

NCA జిమ్‌లో బుమ్రా.. ఫొటో వైరల్

image

వెన్నునొప్పి కారణంగా ఛాంపియన్స్ ట్రోఫీకి దూరమైన బుమ్రా బెంగళూరు NCAలో పునరావాసం పొందుతున్నారు. తాజాగా జిమ్‌లో ఉన్న ఫొటోను ఈ స్టార్ బౌలర్ షేర్ చేస్తూ ‘రీబిల్డింగ్’ అని రాసుకొచ్చారు. దీంతో ఈ ఫొటో వైరలవుతోంది. త్వరగా కోలుకుని ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్‌కు అందుబాటులోకి రావాలని అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. కాగా బుమ్రా స్థానంలో వరుణ్ చక్రవర్తిని బీసీసీఐ CTకి ఎంపిక చేసిన విషయం తెలిసిందే.

error: Content is protected !!