News March 30, 2025

ఆరోగ్యశ్రీలోకి కొత్తగా 164 ప్రైవేట్ ఆస్పత్రులు!

image

TG: రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకంలోకి కొత్తగా 164 ప్రైవేటు ఆస్పత్రులను చేర్చేందుకు ప్రభుత్వం సూత్రప్రాయంగా అంగీకరించింది. ప్రస్తుతం ఆరోగ్యశ్రీ నెట్‌వర్క్‌లో 1,042 ఆస్పత్రులుండగా, ఇందులో 409 ప్రైవేటు హాస్పిటల్స్ ఉన్నాయి. ప్రభుత్వం చికిత్స ఖర్చును రూ.10 లక్షలకు పెంచడంతోపాటు మొత్తంగా 1,835 వ్యాధులను చేర్చింది. దీంతో 2024-25లో 3.53 లక్షల మంది చికిత్స చేయించుకున్నారు.

Similar News

News September 9, 2025

హిమాలయ జ్వాలకు 3 కారణాలు.. 3 రూపాలు!

image

1.హిమాలయ దేశం నేపాల్లో‌ నెలకొన్న అవినీతి, దానికి పరిష్కారం లేకపోవడంపై ఆ దేశ Zen Z(యువత) ‘అసహనం’తో ఉంది. 2.కొందరు నేతలు కుటుంబాలతో విదేశాల్లో లగ్జరీ లైఫ్ గడిపే వీడియోలు ఇటీవల వైరలవగా ప్రజా ధనంతో పాలకుల జల్సాలా? అనే ‘ఆవేదన’ వ్యక్తమైంది. 3.దేశంలో రిజిస్టర్ కాలేదని SM సైట్లను ప్రభుత్వం నిషేధించింది. దీంతో తమ గొంతును పాలకులు అణిచివేశారనే ‘ఆగ్రహం’తో నిరసన జ్వాల నియంత్రణ తప్పి కార్చిచ్చులా దహిస్తోంది.

News September 9, 2025

రేపు జగన్ ప్రెస్‌మీట్

image

AP: మాజీ సీఎం, వైసీపీ చీఫ్ జగన్ రేపు ప్రెస్ మీట్ నిర్వహించనున్నారు. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఉ.11 గంటలకి మీడియాతో సమావేశం అవుతారని YCP ప్రకటనలో తెలిపింది. ఇవాళ యూరియా కొరతపై వైసీపీ నేతలు ‘అన్నదాత పోరు’ నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన రేపు ఏం మాట్లాడుతారో అనే ఆసక్తి నెలకొంది.

News September 9, 2025

ఐదుగురిపై ఛార్జ్‌షీట్ దాఖలుకు సిద్ధమైన ACB

image

TG: ఫార్ములా ఈ-రేస్ <<16712706>>కేసులో<<>> కీలక పరిణామం చోటు చేసుకుంది. కేటీఆర్‌ సహా మరో నలుగురిపై న్యాయ విచారణకు ACB సిద్ధమైనట్లు తెలుస్తోంది. దీనిపై ప్రభుత్వానికి నివేదిక పంపింది. గవర్నర్‌ అనుమతి రాగానే కేటీఆర్‌, అరవింద్‌కుమార్‌, BLN రెడ్డి, కిరణ్‌, FEO సీఈవోపై ఏ1, ఏ2, ఏ3, ఏ4, ఏ5గా ఛార్జ్‌షీట్ దాఖలు చేయనుందని సమాచారం.